పెళ్లి చేసుకుని ఓ ఇంటి కోడలైన కథానాయికల జాబితాలో మధు శాలిని (Madhu Shalini) చేరారు. ఈ మధ్యే నయనతార పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో కొన్నాళ్లుగా ఆమె ప్రేమలో ఉన్న సంగతి అందరికీ తెలుసు. అందువల్ల, ఆ పెళ్లి వార్త ఎవరికీ స‌ర్‌ప్రైజింగ్ అనిపించలేదు. అయితే, మధు శాలిని పెళ్లి మాత్రం ప్రేక్షకులకు స‌ర్‌ప్రైజ్‌ ఇచ్చింది.  సైలెంట్‌గా తమిళ్ హీరోని పెళ్లాడిన ఆమె, సోషల్ మీడియాలో తమ పెళ్లి విషయం వెల్లడించారు. 


Madhu Shalini Weds Gokul: తమిళ్ హీరో గోకుల్ ఆనంద్ (Gokul Anand), తెలుగమ్మాయి మధు శాలిని గురువారం వివాహ బంధంతో ఒక్కటి అయ్యారు. వీళ్లిద్దరి పెళ్లి హైదరాబాద్‌లో జరిగింది. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, కొంత మంది సినిమా ప్రముఖులు హాజరయ్యారు. 


Madhu Shalini Gokul Love Story: తమిళ సినిమా 'పంచాక్షరం'లో మధు శాలిని, గోకుల్ నటించారు. ఆ సినిమా సమయంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించిందని, ఆ తర్వాత అది ప్రేమగా మారిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.


Also Read: 'విరాట పర్వం' రివ్యూ: రానా, సాయి పల్లవి సినిమా ఎలా ఉందంటే?


గోకుల్ అరడజను తమిళ సినిమాల్లో నటించారు. 'అమెరికన్ మాపిళ్ళై', 'టాప్ లెస్' వంటి సిరీస్‌లు చేశారు. ప్రస్తుతం మలయాళ సినిమా 'జాక్ అండ్ జిల్' చేస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన మధు శాలిని... ఈ మధ్య వచ్చిన '9 అవర్స్' వెబ్ సిరీస్‌లో నందమూరి తారకరత్న భార్య పాత్రలో కనిపించారు.


Also Read: 'గాడ్సే' రివ్యూ: సత్యదేవ్ డైలాగులు సూపర్! మరి, సినిమా ఎలా ఉంది?