మెగా అభిమానులకు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ మరో కానుక రెడీ చేశారు. ఆయన దర్శకత్వం వహించిన తాజా సినిమా 'రంగమార్తాండ' (Rangamarthanda Movie). ఇందులో ఓ షాయరీకి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) గళం అందించిన సంగతి తెలిసిందే. ఇటీవల దానిని విడుదల చేశారు. 

షాయరీ చూసి చిరు కంటతడి...'రంగమార్తాండ' చిత్రంలో రంగస్థల కళాకారుల గురించి వివరించే సన్నివేశంలో వచ్చే షాయరీ అది. లక్ష్మీ భూపాల రాశారు. దానికి గళం అందించే సమయంలో, షాయరీకి తన విజువల్స్, ఫోటోలు వచ్చేలా ప్లే చేసిన వీడియో చూసి చిరంజీవి కంటతడి పెట్టుకున్నారు. అందువల్ల, అందులో ఏముంది? అని ప్రేక్షకులు ఆసక్తి కనబరిచారు. షాయరీ చూశాక హ్యాపీ ఫీల్ అయ్యారు. 

ఇప్పుడు హీరోతో ఎడిట్ చేయించి మరీ...షాయరీకి లభిస్తున్న స్పందన తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కృష్ణవంశీ తెలిపారు. ప్రేక్షకులు పంపిస్తున్న సందేశాలు తన హృదయాన్ని టచ్ చేశాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆ ఎనర్జీతో అదే షాయరీ మీద మరో ఎడిట్ చేయించారు. మళ్ళీ చిరంజీవి విజువల్స్ వేసి! ఆ వీడియోకి విజయ నిర్మల మనవడు, నటుడు సీనియర్ నరేష్ కుమారుడు, హీరో అయిన నవీన్ విజయ కృష్ణ ఎడిటింగ్ చేశారని కృష్ణవంశీ చెప్పారు. ఆ వీడియో గురువారం విడుదల చేయనున్నట్లు తెలిపారు. చిరంజీవికి చూపించి మరీ ఆ వీడియో అనుమతి తీసుకున్నామన్నారు. 

Also Read : మెగా, నందమూరి హీరోలు కలుస్తున్నారు - ఫ్యాన్స్ కలిసేది ఎప్పుడు? ఈ గొడవలేంట్రా బాబు?  

షాయరీలో ఏముంది? అనేది చూస్తే...''నేనొక నటుడ్నిచమ్కీల బట్టలేసుకునిఅట్ట కిరీటం పెట్టుకునిచెక్క కత్తి పట్టుకునికాగితపు పూల వర్షంలో కీలు గుర్రంపై స్వారీ చేసేచక్రవర్తిని నేనుకాలాన్ని బంధించి శాసించే నియంతను నేను

నేనొక నటుడ్నినాది కాని జీవితాలకు జీవం పోసే నటుడ్నినేను కాని పాత్రల కోసం వెతికే విటుడ్నివేషం కడితే అన్ని మతాల దేవుడ్నివేషం తీస్తే ఎవ్వరికీ కాని జీవుడ్ని

నేనొక నటుడ్నినవ్విస్తాను, ఏడిపిస్తాను, ఆలోచనల సంద్రంలో ముంచేస్తానుహరివిల్లుకు ఇంకో రెండు రంగులేసి నవరసాలూ మీకిస్తానునేను మాత్రం నలుపు తెలుపుల గందరగోళంలో బతుకుతుంటాను

నేనొక నటుడ్నిజగానికి జన్మిస్తానుసగానికి జీవిస్తానుయుగాలకు మరణిస్తానుపోయినా బ్రతికుంటాను

నేనొక నటుడ్నిలేనిది ఉన్నట్టు చూపే కనికట్టుగాడ్నిఉన్నది లేనట్టు చేసే టక్కుటమారపోడ్నిఉన్నదంతా నేనే అనుకునే అహం బ్రహ్మస్మినిఅసలు ఉన్నానో లేనో తెలియని ఆఖరి మనిషిని

నేనొక నటుడ్నిగతానికి వారధి నేనువర్తమాన సారథి నేనురాబోయే కాలంలో రాయబోయే చరిత్ర నేనుపూటపూటకూ రూపం మార్చుకునే అరుదైన జీవిని నేను

నేనొక నటుడ్నిపిడుగుల కంఠాన్ని నేనుఅడుగుల సింహాన్ని నేనునరం నరం నాట్యమాడే నటరాజు రూపాన్ని నేనుప్రపంచ రంగస్థలంలో పిడికెడు మట్టిని నేనుప్రచండంగా ప్రకాశించు రంగమార్తాండుడ్ని నేను

నేనొక నటుడ్నిఅసలు మొహం పోగొట్టుకున్న అమాయకుడ్నికానీ 9 తలలు ఉన్న నటరావణుడ్నినింగి, నేల రెండు అడుగులైతేమూడో పాదం మీ మనసుల మీద మోపే వామనుడ్నిమీ అంచనాలు దాటే ఆజానుబాహుడ్నిసంచలనాలు సృష్టించే మరో కొత్త దేవుడ్ని

నేనొక నటుడ్నిఅప్సరసల ఇంద్రుడ్నిఅందుబాటు చంద్రుడ్నిఅభిమానుల దాసుడ్నిఅందరికీ ఆప్తుడ్ని

చప్పట్లను భోంచేస్తూఈలలను శ్వాసిస్తూఅనుక్షణం జీవించే అల్పసంతోషిని నేనుమహా అదృష్టవంతుడ్ని నేనుతీర్చలేని రుణమేదో తీర్చాలని పరితపించేసగటు కళాకారుడ్ని నేను

ఆఖరి శ్వాస వరకూ నటనే ఆశ నాకునటుడిగా నన్ను ఇష్టపడ్డందుకు శతకోటి నమస్సులు మీకు''

'రంగమార్తాండ' చిత్రంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ భరద్వాజ్, శివాత్మికా రాజశేఖర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read : అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు - టాప్‌లో బాలకృష్ణ, నెక్స్ట్ ఎవరంటే?