బుల్లితెరపై నెంబర్ వన్ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్. టీఆర్ఫీ పరంగా కూడా ఈ షో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకుంది ఈ షో. ప్రస్తుతం ఐదో సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈసారి కంటెస్టెంట్స్ లో చాలా వరకు అన్నీ ముఖాలే ఉన్నాయి. అయినప్పటికీ వారంతా తమ గేమ్ తో బాగానే పాపులర్ అవుతున్నారు. షో మొదలై రెండు వారాలే అయింది కానీ ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. 


సెకండ్ వీక్ లో అయితే హౌస్ మేట్స్ అంతా రెచ్చిపోయి ఆడేశారు. ఈ క్రమంలో కొందరు అసభ్యపదజాలం వాడగా.. మరికొందరు కొట్టుకునే వరకు వెళ్లారు. ఇలా మూడు తిట్లు, ఆరు గొడవలతో షో బాగానే నడుస్తోంది. మొదటి వారంలో సరయు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో ఉమాదేవి హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుందని అంటున్నారు. ఈ విషయంలో కాసేపట్లో క్లారిటీ రానుంది. ఇదిలా ఉండగా.. ఈసారి మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ను తీసుకురావడంతో.. ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారనే విషయం ఆసక్తికరంగా మారింది. 


Also Read: హౌస్ మేట్స్ కి క్లాస్ పీకిన నాగ్.. ఈ వారం ఆ ముగ్గురూ సేఫ్..


అందుతున్న సమాచారం ప్రకారం.. హౌస్ మేట్స్ అందరికీ కూడా వారానికి ఇంత అని చెల్లిస్తున్నారట. అందులో చాలా మందికి లక్ష, అంతకంటే తక్కువే ఇస్తున్నారు. హౌస్ లో ఉన్న అందరిలో అత్యధికంగా యాంకర్ రవి, షణ్ముఖ్ లకు చెల్లిస్తున్నారు. వీరిద్దరినీ వారానికి రూ.4 లక్షల చొప్పున ఇస్తున్నారట. యానీ మాస్టర్, లోబోలకు రూ.3 లక్షలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. 


జస్వంత్, లహరి, శ్రీరామచంద్ర, ప్రియా, ఉమాదేవిలకు లక్ష నుంచి రెండు లక్షల రేంజ్ లో ఇస్తున్నారట. అందరికంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకుంటుంది విశ్వ, నటరాజ, శ్వేతా వర్మ, వీజె సన్నీ, సిరి, ప్రియాంక అని తెలుస్తోంది. వీరందరికీ వారానికి రూ.60 వేలు చొప్పున ఇస్తున్నారట. గత సీజన్ లో పాల్గొన్న వారికి కూడా ఇదే రేంజ్ లో రెమ్యునరేషన్ ఇచ్చారు. కానీ షో బాగా హిట్ అవ్వడంతో ఫినాలేలో డబ్బులు బాగానే డిస్ట్రిబ్యూట్ చేశారు. మరి ఈసారి ఏ ఏ కంటెస్టెంట్ కి అదనంగా డబ్బులు వస్తాయో చూడాలి!


Also Read:ఈ చిత్రంలోని హీరోయిన్ ఎవరో చెప్పుకోగలరా..?


Also Read: బుల్లితెరపై మహేష్‌తో ఎన్టీఆర్ గేమ్.. టీఆర్పీ ఆకాశాన్నంటుతుందా?


Also Read: అభిమానికి క్యాన్సర్... వీడియోకాల్ చేసి మాట్లాడిన ప్రభాస్


Also Read: హాస్పిటల్ లో సాయి ధరమ్ తేజ్.. కానీ సినిమా రిలీజ్ పక్కా..