Bigg Boss Telugu Season 8: ఆట హాట్ గురూ అంటున్నారు.. బిగ్ బాస్ కంటెస్టెంట్స్. లాంచింగ్ తర్వాత రెండో రోజు గేమ్ ను హాట్ హాట్ గా కంటిన్యూ చేశారు. వంట విషయంలో అభిప్రాయ భేదాలతో మొదలైన ఆట.. నానిమేషన్స్ తో పీక్స్ కు చేరింది. చీఫ్స్ గా ఎంపికైన ముగ్గురు.. నిఖిల్, నైనిక, యశ్మీ మినహా.. మిగతా కంటెస్టెంట్స్ అంతా నామినేషన్స్ వేశారు. రెండు రోజుల్లో తమకు నచ్చని విషయాలేంటో చెబుతూ.. అందుకు కారణమైన వారిని నామినేషన్స్ బోనులో నిలబెట్టారు. మధ్యలో.. చీఫ్స్ కు కీలక బాధ్యత అప్పజెప్పిన బిగ్ బాస్.. ఆటను మరింత రక్తి కట్టేలా చేశారు. ఆ బాధ్యత కారణంగా.. ముగ్గురు చీఫ్స్.. తమ అభిప్రాయాలు చెబుతూ మిగతా కంటెస్టెంట్లతో వాగ్వాదానికి దిగడం.. ప్రతిగా కంటెస్టెంట్లూ స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడం.. ఇలా నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది.


ఎపిసోడ్ లో కనిపించిన ప్రకారంగా చూస్తే.. యశ్మీని మూడో చీఫ్ గా ఎంపిక చేయడాన్ని సోనియా మరోసారి తప్పుబడుతూ నిఖిల్ తో డీప్ డిస్కషన్ కు దిగింది. ఈ సీన్ తో ఎపిసోడ్ ప్రారంభమైంది. యశ్మీకి ఎవరు అండగా నిలిచారు.. ఆమెను మూడో చీఫ్ గా ఎన్నుకోవడానికి కారణం ఏంటి అని పదే పదే నిఖిల్ ను ప్రశ్నించింది. నైనిక కూడా మధ్యలో ఎంటరైంది. తాను చిన్న పిల్లలా బిహేవ్ చేయడం లేదని.. తనకు 23 ఏళ్ల వయసుందని చెబుతూ.. యశ్మీని ఎన్నుకోవడంలో తన నిర్ణయాన్ని నైనిక సమర్థించుకుంది. నిఖిల్ కూడా.. తనకు ఎలాంటి పక్షపాతం లేదని.. ఈ 2 రోజుల్లో తనకు కలిగిన అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకునే తాను యశ్మీకి మద్దతుగా నిలిచానని సోనియాకు చెప్పుకొచ్చాడు.


ఉదయం 9 గంటల 30 నిముషాలకు.. ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. సాంగ్ తో రెండో రోజు ఆట ప్రారంభమైంది. తర్వాత.. మధ్యాహ్నం 12 గంటల సమయంలో మణికంఠ కాస్త నిద్రపోవడంతో.. బిగ్ బాస్ లో కుక్క అరుపులు వినిపించాయి. తాను అలా కన్ను మూశాను మాత్రమే అని.. నిద్రపోలేదని, అంతలోనే కుక్క అరిచిందని మణి కాస్త నర్వస్ అయ్యాడు. మిగిలిన కంటెస్టెంట్స్ ఇదే అదనుగా.. మణికంఠను కార్నర్ చేస్తూ.. ఎందుకలా ఒంటరిగా ఉంటాడో అర్థం కావడం లేదని.. బిగ్ బాస్ హౌస్ లో అలా ఉండడం సరికాదని కామెంట్ చేసుకున్నారు. కాసేపటికి.. బేబక్క వంట చేస్తున్న తీరుపై కొందరు సమర్థిస్తే.. మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. వంట ఒకేసారి జరుగుతుందని.. మధ్యలో హౌస్ మేట్స్ వంట చేసుకుంటామని అంటే కుదరదని.. బేబక్క, నిఖిల్.. నబిల్ కు చెప్పారు. మిగతా వాళ్లు వచ్చి అడిగినా కూడా.. ఎలాంటి ఎక్జెంప్షన్ లేదని, రూల్ ఈస్ రూల్.. రూల్ ఫర్ ఆల్ అని తేల్చి చెప్పారు.


అసలు ఆట.. సాయంత్రం 4 గంటలకు మొదలైంది. అడవిని తలపించే థీమ్ తో ప్రత్యేకంగా రూపొందించిన సెట్ లో.. ఈ సీజన్ మొట్టమొదటి నామినేషన్ల ప్రక్రియను బిగ్ బాస్ ప్రారంభించారు. చీఫ్స్ గా ఉన్న నిఖిల్, నైనిక, యశ్మీ.. ఎవరిపైనా నేరుగా నామినేషన్ వేయకుండా.. మరో బాధ్యతను అప్పగించారు. ఈ ముగ్గురూ తప్ప.. మిగిలిన 11 మందికి నానిమేషన్లు వేసే అవకాశం ఇచ్చారు. ప్రతి హౌస్ మేట్.. ఇద్దరిపై నామినేషన్ వేయవచ్చని, అక్కడ ఏర్పాటు చేసిన బండపై ఆ ఇద్దరి ఫొటోలు పెట్టి.. నామినేషన్లకు గల కారణాలు వివరించాలని ఆర్డర్ చేశారు. చీఫ్స్ మాత్రం.. ఆ ఆర్గ్యుమెంట్స్ వినాలని.. చివరికి ముగ్గురిలో.. ఎవరైనా ఒకరు ముందుగా వెళ్లి.. అక్కడ ఏర్పాటు చేసిన కత్తిని అందుకోవాలని చెప్పారు. నామినేషన్లో ఉన్న ఇద్దరినుంచి ఒకరిని మినహాయించి.. మిగతా హౌజ్ మేట్ ఫొటోపై కత్తిని గుచ్చి.. నామినేషన్ లిస్ట్ లో ఖరారు చేయాలని చెప్పారు.



Also Read: Bigg Boss 8 Telugu: బిగ్‌బాస్‌కి కలిసోచ్చిన లావ్‌ ట్రాక్స్‌ - ఈ ఏడు సీజన్స్‌లో హాట్‌టాపికైన ప్రేమ జంటలు ఇవే, ఈసారి...


అలా.. సోనియా వేసిన నామినేషన్లతో మొదలైన ప్రక్రియ.. ఎపిసోడ్ ముగిసేసరికి బేబక్క వేసిన నామినేషన్ల వరకు చేరుకుంది. మిగిలిన కంటెస్టెంట్ల నామినేషన్లు.. రేపటి ఎపిసోడ్ లో కంటిన్యూ కానున్నాయి. ఓవరాల్ గా చూస్తే.. వంట విషయంలో మొదలైన చిచ్చు.. నామినేషన్లతో రచ్చ రచ్చ జరిగేవరకూ వెళ్లింది. ఈ హీట్.. రేపటి ఎపిసోడ్ పై అంచనాలు పెంచింది.