Bigg Boss 17 Big shock to Mannara Chopra: టెలివిజన్ రంగంలో బిగ్గెస్ట్ రియాల్టీ షోగా పేరొందిన 'బిగ్ బాస్'కి ఆడియన్స్ నుంచి ఎలాంటి ఆదరణ లభిస్తుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హూస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ ఇప్పటి వరకు 16 సీజన్లు పూర్తి చేసుకుంది. ఈ రోజు 17వ సీజన్ ముగింపు దశకు చేరుకుంది. బాలీవుడ్ లో బిగ్ బాస్ మంచి సక్సెస్ సాధించడంతో ఇతర భాషలు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంతో పాటు మరికొన్ని భాషల్లో బిగ్ బాస్ షో నిర్వహిస్తున్నారు. తెలుగులో కింగ్ నాగార్జున హూస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 ఇటీవల పూర్తి అయ్యింది.


బాలీవుడ్ బిగ్ బాస్ సీజన్ 17 ఈ రోజు (జనవరి 28) ఫినాలే జరగనుంది. అయితే... ఈసారి కప్ కొట్టే రేసులో ఆరుగురు కంటెస్టెంట్స్ ఫైనల్ లో నిలిచారు. వీరిలో బాలీవుడ్ బ్యూటీ మన్నార్ చోప్రా కూడా ఉంది. కథానాయికగా తెలుగు హిందీ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న మన్నారా చోప్రా బాలీవుడ్ అగ్ర హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ అవుతుంది. ఈమె బిగ్ బాస్ సీజన్ 17లో ఎంట్రీ ఇచ్చి తన బిహేవియర్, ఆట తీరుతో ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. బిగ్ బాస్ ఇచ్చే ప్రతి టాస్క్ లోను తన పొటెన్షియాలిటీ చూపించింది.


ముఖ్యంగా హౌస్ లో ఎమోషన్స్ చూపించడం, తప్పులను నిజాయితీగా ఒప్పుకోవడం, ఎవరి సపోర్ట్ లేకుండా ఒంటరిగా ఆడడంతో సీజన్ 17 లోని బెస్ట్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. తోటి కంటెస్టెంట్స్ లాగా పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోయినా హౌస్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరచడంతో ఈ సీజన్ లో మన్నారాను విజేతగా నిలబెట్టవచ్చనే మాటలు సైతం వినిపించాయి. కానీ, ఇప్పుడు మన్నారా చోప్రా టాప్ 3 లిస్టులో కూడా ఉండకపోవచ్చని హిందీ టీవీ వర్గాల సమాచారం. ఆమెకు పెద్ద షాక్ ఖాయమని అంటున్నారు. ఆర్మ్యాక్స్ నివేదిక ప్రకారం... సీజన్ 17లో మోస్ట్ పాపులర్ కంటెస్టెంట్ మునావర్ ఫరూఖీ ఉన్నాడు. అతను విన్నర్ అని లీక్స్ వచ్చాయి. సెకండ్ ప్లేస్ లో అంకిత ఉంటే అభిషేక్ కుమార్ టాప్ త్రీ లో నిలిచాడు.


Also Read: పాన్ ఇండియా సినిమాలో శ్రీ లీలకు ఛాన్స్ - ఆ స్టార్ హీరోతో రొమాన్స్?


మన్నారా చోప్రా నాలుగో స్థానంలో ఉన్నారట. అరుణ్ మహాశెట్టి ఐదు స్థానంలో ఉన్నాడు. ఈ పోల్ ఆధారంగా అంకిత, అభిషేక్ టాప్ త్రీ ఫైనలిస్ట్ లో ఉండే అవకాశం ఉందని మునావర్ ఈ సీజన్ కి విన్నర్ గా నిలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది. మొదటినుంచి హౌస్ లో బెస్ట్ కంటెస్టెంట్ గా1 పేరు తెచ్చుకున్న మన్నారా కి మాత్రం టాప్-3 లిస్టులో చోటుదక్కకపోవడంతో ఆమె ఫ్యాన్స్ నిరాశకు లోనవుతున్నారు. ఇక మన్నారా చోప్రా విషయానికొస్తే.. మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ 2014లో 'ప్రేమ గీమా జాన్ తానై' సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. సునీల్ తో కలిసి 'జక్కన్న' సినిమాలో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తిక్క, సీత వంటి సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు పలు తమిళ, హిందీ సినిమాలు చేసింది.


ALso Read: మెగాస్టార్ కెరీర్‌లో మరో రికార్డ్ - 'విశ్వంభర' ఓవర్సీస్ రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారంటే?