జబర్దస్ కామెడీ షోతో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. ఆ షోకు సంబంధించి వందల ఎపిసోడ్లకు యాంకర్ గా చేసి.. మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత యాంకరింగ్  పక్కన పెట్టి సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది.


ప్రస్తుతం అనసూయ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా మారింది. బోల్డ్ క్యారెక్టర్స్ చేస్తూ యువతను గిలిగింతలు పెట్టింది.  నెమ్మదిగా పలు సినిమాల్లో లీడింగ్ రోల్స్ చేస్తోంది. ఇటీవల అనసూయ ప్రధాన పాత్రలో ‘దర్జా’ అనే సినిమా తెరకెక్కింది. అటు ‘వాంటెడ్ పండుగాడ్’ చిత్రంలో కీలక పాత్ర పోషించింది. వెండితెర ఆఫర్స్ వరుసబెట్టి వస్తున్న తరుణంలో అనవసర వివాదాల్లో తల దూర్చి అనసూయ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 


‘లైగర్’ మూవీ ఫెయిల్యూర్ తర్వాత ఈ అమ్మడు ‘ఆంటీ’ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.  లైగర్ ఫ్లాప్ ను ఎంజాయ్ చేస్తూ  పరోక్షంగా ట్వీట్ వేసి అనసూయ వివాదానికి కారణం అయ్యింది.  విజయ్ దేవరకొండను కర్మఫలం వెంటాడిందని..  అందుకే లైగర్ ప్లాప్ అయ్యింది అని అర్థం వచ్చేలా  ట్వీట్ చేసింది. దీంతో ది విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఆంటీ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేశారు. దీంతో తనను ఆంటీ అన్న వారిపై కేసు నమోదు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. నటుడు బ్రహ్మాజీ సైతం అనసూయపై ఇండైరెక్ట్ సెటైర్ వేశాడు.  


తాజాగా అనసూయ.. యాంకర్ సుమ నిర్వహించే ‘క్రేజీ కిచన్’ అనే వంటల కార్యక్రమంలో పాల్గొన్నది. చాలా మంది తనకు వంటలు రావని అందరూ అనుకుంటారని.. కానీ, తాను చాలా బాగా వంటలు చేస్తానని చెప్పింది. ఈ షోలో తాను బాగా వంట చేస్తానని ఈ షోలో నిరూపించనున్నట్లు చెప్పింది. మాటలో మాటగా ఆంటీ అనే విషయం మళ్లీ ముందుకు వచ్చింది. వాతావానికి “అత్తా, పిత్తా అనడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. చివరికి నా కోడలు కూడా నన్ను అత్త అని పిలవడం ఇష్టం ఉండదు. జస్ట్ అను అని పిలిస్తే చాలు” అని చెప్పింది. గురువారం ఈ కార్యక్రమం సుమ యూట్యూబ్ చానెల్ లో ప్రసారం కానుంది.






మరోవైపు తన ఆంటీ వివాదం మూలంగా అనసూయ పలు అవకాశాలను కోల్పోయినట్లు తెలుస్తున్నది. సుకుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబోతున్న ‘పుష్ప-2’ నుంచి తనని తప్పించినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఆమె ప్లేస్ లో మరో నటిని తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. అటు ‘పుష్ప’ సినిమాలో సునీల్ భార్య దాక్షాయనిగా నటించి ఆకట్టుకుంది. అటు మరో ఇద్దరు దర్శకులు కూడా ఆమె తమ ప్రాజెక్టుల నుంచి తొలగించినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది.  ఈ వార్తలు వాస్తవమేనా? అనే విషయం అధికారికంగా తెలియాల్సి ఉంది.


Also Read : ఆస్కార్ బరిలో నిలిచిన ‘చల్లో షో’ కథ ఏంటీ? అందుకే, ఆ చిత్రానికి అంత హైప్?



Also Read : ముందుంది అసలైన యుద్ధం - రంగంలోకి దిగిన 'ఆర్ఆర్ఆర్' టీమ్