26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్‌ జీవితం ఆధారంగా 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషించారు. 'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది.

 

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.18 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరుపుకోగా.. రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఓవర్సీస్ లో కలిపి రూ.13 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన లాభాల దిశగా దూసుకుపోతుంది. మూడు రోజుల్లో ప్రాంతాల వారీగా ఎంత కలెక్ట్ చేసిందో ఇప్పుడు చూద్దాం!

 

నైజాం           -  రూ.5.01 కోట్లు
సీడెడ్           -  రూ.1.28 కోట్లు
ఉత్తరాంధ్ర   - రూ.1.42 కోట్లు
ఈస్ట్             - రూ.95 ల‌క్ష‌లు
వెస్ట్              - రూ.63 ల‌క్ష‌లు
గుంటూరు    - రూ.75 లక్షలు
కృష్ణా            - రూ.71 లక్షలు

నెల్లూరు       - రూ.50 లక్షలు

 

మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ.11.25 కోట్ల షేర్ ను సాధించింది ఈ సినిమా. గ్రాస్ రూపంలో చూసుకుంటే ఇది రూ.18.80 కోట్లు. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకొని రూ.1.25 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. హిందీ, ఇతర భాషల్లో కలిపి రూ.2.15 కోట్లు, ఓవర్సీస్ లో రూ.4.70 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. ఓవరాల్ గా ఈ సినిమా మూడు రోజులకు గాను రూ.19.35 కోట్లు సాధించింది. అంటే మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి లాభాలో బాటలోకి చేరిపోయిందన్నమాట!