Chhattisgarh Elections 2023 ABP Cvoter Opinion Polls: 


త్వరలో ఎన్నికలు జరగనున్న 5 రాష్ట్రాలలో ఛత్తీస్‌గఢ్‌ ఒకటి. ఛత్తీస్‌గఢ్‌లో అధికార కాంగ్రెస్‌, బీజేపీ మధ్య గట్టి పోటీ ఉండనుంది. అయితే కాంగ్రెస్ స్వల్ప మెజార్టీతో మరోసారి అధికారంలోకి రానుంది. కానీ కాంగ్రెస్ సీట్లు కోల్పోగా, బీజేపీ బలోపేతం కానుందని తాజా సర్వేలో తేలింది. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలపై ABP News Cvoter Final Opinion Pollలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తంగా 90 అసెంబ్లీ స్థానాలుడగా.. ఇందులో అధికార కాంగ్రెస్‌కి 45- 51 సీట్లు రాగా, ప్రతిపక్ష బీజేపీకి 36 నుంచి గరిష్టంగా 42 స్థానాలు వస్తాయని తాజా ఒపీనియన్ పోల్ వెల్లడించింది. మ్యాజిక్ ఫిగర్ 46 సీట్లు అంటే.. ఛత్తీస్ గఢ్ ల మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందని సర్వే చెబుతోంది.




సెంట్రల్ ఛత్తీస్ గఢ్‌ కీలకం..
సెంట్రల్ ఛత్తీస్ గఢ్ లో 64 అసెంబ్లీ స్థానాలుండగా.. ఈ రీజియన్ లో కాంగ్రెస్ హవా కొనసాగనుంది. అధికార కాంగ్రెస్ కు 34-38 సీట్లు, 45.6శాతం ఓట్లు పోల్ కానున్నాయి. బీజేపీకి 23-27 సీట్లు రాగా, 42 శాతం ఓట్ షేర్ వస్తుందని సర్వేలో తేలింది. కాంగ్రెస్ గత ఎన్నికల కన్నా తక్కువ సీట్లకు పరిమితం కానుండగా, బీజేపీ ఈ రీజియన్ లో భారీగా ఓటు షేర్ తో పాటు సీట్లు సైతం కొల్లగొట్టేలా కనిపిస్తోంది.


సౌత్ ఛత్తీస్‌గఢ్‌లో 12 సీట్లు ఉండగా... కాంగ్రెస్ 5-9 సీట్లు రాగా, ఇక్కడ కాంగ్రెస్‌కి 45% మేర ఓట్లు పోల్‌ అయ్యే అవకాశాలున్నాయి. ప్రతిపక్ష బీజేపీకి 3-7 సీట్లు, 4.7 శాతం ఓట్లు రానున్నాయి. ఇతరులకు గత ఎన్నికల కన్నా తగ్గినా.. 13.3 శాతం ఓట్లు పోల్‌ అవుతాయని తాజా సర్వే వెల్లడించింది. 


నార్త్‌ ఛత్తీస్‌గఢ్‌లో ప్రతిపక్ష బీజేపీ ముందంజలో ఉంది. ఈ రీజియన్ లో 14 సీట్లు ఉండగా.. బీజేపీ 7-11 సీట్లు కైవసం చేసుకోనుండగా, కాంగ్రెస్‌కి 3-7 సీట్లు వస్తాయని ఒపీనియన్ పోల్ లో తేలింది. గత నెలలో వెల్లడైన ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ ఫలితాలకు తాజా సర్వేకు అంత వ్యత్యాసం లేదు. కాంగ్రెస్ కొన్ని సీట్లు కోల్పోయినా అధికారంలోకి రానుండగా, బీజేపీ ఇక్కడ బలోపేతం అయ్యే అవకాశం కనిపిస్తోంది.


గత నెలలో ఛత్తీస్ గఢ్ ఎన్నికల ఒపీనియన్ పోల్ ఫలితాలివే..
ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికలపై అక్టోబర్ లో ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈసారి కూడా కాంగ్రెస్‌కే మొగ్గు చూపే అవకాశాలున్నాయని తెలిపింది ABP Cvoter Opinion Poll. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 48 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక బీజేపీకి 42 స్థానాల్లో విజయం సాధిస్తుందని ఈ పోల్ వెల్లడించింది. ఇతరులకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కే అవకాశాలు కనిపించడం లేదు. మొత్తంగా చూస్తే ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌కి 45-51 సీట్లు, బీజేపీకి 39-45 స్థానాలు దక్కనున్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 68 సీట్లు, బీజేపీ 15 సీట్లు గెలుచుకున్నాయి. ఇక ఓటు శాతం పరంగా చూసుకుంటే ఈ సారి కాంగ్రెస్‌కి 45.3%, బీజేపీకి 43.5% ఓట్లు దక్కే అవకాశాలున్నాయని ఏబీపీ సీ ఓటర్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.


[Disclaimer: Current survey findings and projections are based on CVoter Pre Poll CATI interviews conducted among 18+ adults statewide, all confirmed voters (sample size 63,516). The data is weighted to the known demographic profile of the States. Sometimes the table figures do not sum to 100 due to the effects of rounding. Our final data file has Socio-Economic profile within +/- 1% of the Demographic profile of the State. We believe this will give the closest possible trends. The sample spread is across all Assembly segments in the poll bound state. MoE is +/- 3% at macro level and +/- 5% at micro level VOTE SHARE projection with 95% Confidence interval.]