SHRESHTA NETS 2024: దేశంలో ప్రతిభావంతులైన ఎస్సీ విద్యార్థులకు సీబీఎస్‌ఈ (CBSE) అనుబంధ గురుకులాల్లో 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు నిర్వహించే 'నేషనల్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ శ్రేష్ఠ (SHRESHTA- NETS 2024) పరీక్ష తేదీ మారింది. దేశంలో లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష తేదీల్లో మార్పు చేసినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ పరీక్షను షెడ్యూల్ కన్నా ముందే నిర్వహించాలని ఎన్టీఏ నిర్ణయించింది. కేంద్ర సామాజిక న్యాయం-సాధికార మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ పరీక్షను తొలుత మే 24న జరపాలని నిర్ణయించగా.. ఎన్నికల నేపథ్యంలో మే 11కు మార్చినట్లు ఎన్‌టీఏ (NTA) మార్చి 20న ఒక ప్రకటనలో తెలిపింది. కొత్త షెడ్యూలు ప్రకారం మే 11న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష జరిగిన నాలుగు నుంచి ఆరు వారాల్లో ఫలితాలు ప్రకటించనున్నారు. 


ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు..
పరీక్ష కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ మార్చి 12న ప్రారంభమైంది. సరైన అర్హతలున్నవారు ఏప్రిల్‌ 4 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు మే 24న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 'శ్రేష్ఠ' పథకం ద్వారా దేశవ్యాప్తంగా 3 వేల సీట్లను భర్తీ చేస్తారు. ఈ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన ఎస్సీ విద్యార్థులు సీబీఎస్‌ఈ అనుబంధ ప్రైవేటు విద్యాసంస్థల్లో 9, 11వ తరగతుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంటుంది.


వివరాలు..


➥ నేషనల్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఫర్‌ శ్రేష్ఠ- నెట్స్‌ 2024


అర్హత: విద్యార్థులు ప్రస్తుత విద్యాసంవత్సరం(2023-24)లో 8, 10వ తరగతులు చదువుతుండాలి. విద్యార్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం 2.5 లక్షలకు మించకూడదు.


వయోపరిమితి: 9వ తరగతిలో ప్రవేశాలు కోరువారు 31.03.2024 నాటికి 12-16 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.04.2008 - 31.03.2012 మధ్య జన్మించి ఉండాలి. ఇక 11వ తరగతిలో ప్రవేశాలు కోరువారు 31.03.2024 నాటికి 14-18 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.04.2006 - 31.03.2010 మధ్య జన్మించి ఉండాలి. 


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: ప్రవేశపరీక్ష ర్యాంకు ఆధారంగా.


పరీక్ష విధానం..
* మొత్తం 400 మార్కులకు రాతపరీక్ష నిర్వహిస్తారు. పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 4 మార్కులు కేటాయించారు. ఎలాంటి నెగెటివ్ మార్కులు లేవు. ఇందులో మ్యాథమెటిక్స్-30 ప్రశ్నలు, సైన్స్-20 ప్రశ్నలు, సోషల్ సైన్స్-25 ప్రశ్నలు, జనరల్ అవేర్‌నెస్/నాలెడ్జ్-25 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 3 గంటలు. హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష నిర్వహిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.03.2024.


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 04.04.2024 (05:00 P.M.)


➥ దరఖాస్తుల సవరణ: 06.04.2024 - 08.04.2024 (05:00 P.M.)


➥ అడ్మిట్‌కార్డు డౌన్‌లోడ్: 12.05.2024 నుంచి. 


➥ పరీక్ష తేదీ: 24.05.2024.


పరీక్ష సమయం: 02.00 PM to 05.00 PM (3 గంటలు)


➥ ఫలితాల వెల్లడి: పరీక్ష తర్వాత 4 - 6 వారాల్లో.


Notification


Online Application


Website


Related  Articles:


పాలీసెట్‌ అభ్యర్థులకు అలర్ట్‌, పరీక్ష షెడ్యూలులో మార్పు, కొత్త తేదీ ఇదే!


ఐసీఏఐ సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల కొత్త షెడ్యూలు విడుదల - ఎగ్జామ్స్ తేదీలివే!


 

ఐసీఎస్‌ఐ సీఎస్ పరీక్షల తేదీల్లో మార్పులు, కొత్త షెడ్యూలు ఇదే

 

ఏపీ ఎప్‌సెట్-2024 పరీక్ష తేదీల్లో మార్పు, పీజీసెట్ తేదీ మారే అవకాశం!

 

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్-2024 పరీక్ష వాయిదా - కొత్త తేదీ ఇదే