అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంజనీరింగ్‌, ఫార్మసీ, అగ్రికల్చర్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌ (ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్) - పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. ఈఏపీసెట్ ఇంజనీరింగ్ విభాగం పరీక్షలు ఆగస్టు 19, 20, 23, 24, 25 తేదీల్లో... అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ విభాగం పరీక్షలను సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. మొత్తం 120 పరీక్ష కేంద్రాల్లో నిర్వహిస్తామని తెలిపారు. ఈ నెల 25న ఇంజనీరింగ్‌ ప్రాథమిక కీ విడుదల చేస్తామని పేర్కొన్నారు. ఈ పరీక్షల కోసం మొత్తం 2,59,156 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కోవిడ్ పాజిటివ్ విద్యార్థులకు పరీక్షకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు.


Also Read: AP EAPCET 2021 Hall Ticket: ఈఏపీసెట్ హాల్ టికెట్లు విడుదల... మీ ఎగ్జామ్‌ ఎప్పుడో వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోండి


రెండు సెషన్లలో పరీక్షలు..
ఈ పరీక్షలు మొత్తం రెండు సెషన్లలో జరగనున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ .. మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. జేఎన్‌టీయూ కాకినాడ ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈఏపీసెట్‌ ద్వారా ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీటెక్‌ అగ్రి ఇంజనీరింగ్, బీటెక్‌ ఫుడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, బీఎస్సీ (హార్టికల్చర్‌), బీఎస్సీ (అగ్రి), బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్‌/ బీఎఫ్‌ఎస్సీ, బీ-ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులలో ప్రవేశాలు పొందవచ్చు. 


Also Read: CBSE Class 10, 12 Result Update: ఈ నెల 25 నుంచి సీబీఎస్ఈ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు.. ఇవే పూర్తి వివరాలు


ఇంట‌ర్ వెయిటేజీ తొల‌గింపు..
ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మా కాలేజీల‌లో ప్రవేశాలకు ఇంటర్‌ వెయిటేజ్‌ మార్కుల‌ను తొల‌గించిన‌ట్లు రాష్ట్ర ఇంట‌ర్ బోర్డు వెల్లడించింది. కోవిడ్ కార‌ణంగా ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించ‌డానికి అవ‌కాశం లేక‌పోవ‌డంతో ఏపీ ఉన్న‌త విద్యా మండ‌లి కొన్ని మార్పులు చేసింది. ఈ ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల‌లో గ‌తేడాది వ‌ర‌కు విద్యార్థుల ఇంట‌ర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చేవారు. ఈ ఏడాది ఈఏపీసెట్ ఫ‌లితాన్ని 100శాతం రాత పరీక్ష మార్కులతో ఇవ్వ‌నున్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ మార్కుల ఆధారంగా విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మా, అగ్రిక‌ల్చ‌ర్ కాలేజీల‌లో ప్రవేశాలు పొందుతార‌ని ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శి సుధీర్‌ ప్రేమ్‌ కుమార్ తెలిపారు. 


Also Read: AP LPCET 2021: ఏపీలో లాంగ్వేజ్ పండిట్ కోర్సు ప్రవేశాలు.. ఎల్‌పీసెట్‌ నోటిఫికేషన్ విడుదల..