ఏపీలోని కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయం బాలికల ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న 352 కేజీబీవీ పాఠశాలల్లో 2023 - 2024 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి, ఇంటర్మీడియట్‌తో పాటు 7, 8, 9 తరగతుల్లో మిగిలిపోయిన బ్యాక్‌లాగ్ సీట్లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. సరైన అర్హతలు గల బాలికలు ఏప్రిల్ 20లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలోని కేజీవీబి పాఠశాలల్లో దాదాపు 8600 మంది విద్యార్థినులు చదువుతున్నారు.


వివరాలు..


* ఏపీ కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో ప్రవేశాలు


అర్హత: అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, స్కూల్ మధ్యలో మానేసిన డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, దారిద్ర్యరేఖకు దిగువున ఉన్న బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.


ఎంపిక విధానం: ఆన్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులను మాత్రమే అడ్మిషన్ కోసం పరిగణిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. అడ్మిషన్లు పొందిన వారి వివరాలను అయా పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో ప్రదర్శిస్తారు.


ముఖ్యమైన తేదీలు..


➥ ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2023.


➥ ఎంపిక జాబితా వెల్లడి, : 21.4.2023 - 25.04.2023.


➥ సర్టిఫికేట్ వెరిఫికేషన్: 26.04.2023 నుండి 30.04.2023 వరకు.


Website


ALso Read:


1442 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల మెరిట్‌ జాబితా విడుదల, అభ్యంతరాలకు అవకాశం!
తెలంగాణలోని బోధనాసుపత్రుల్లో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నవారి మెరిట్ జాబితాను వైద్యారోగ్యసేవల రిక్రూట్‌మెంట్ బోర్డు వెల్లడించింది. ఈ జాబితాకు సంబంధించిన అభ్యంతరాలుంటే మార్చి 29న ఉదయం 10.30 నుంచి ఏప్రిల్ 1న సాయంత్రం 5.30 గంటలలోపు తెలపాలని బోర్డు కార్యదర్శి గోపీకాంత్ రెడ్డి మార్చి 28న ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు లాగిన్ ద్వారా మాత్రమే అభ్యంతరాలను తెలపాలని, ఇతర రూపాల్లో పంపితే పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్ టీచర్లు అందుబాటులో లేకుంటే ఖాళీల్లో 15 శాతం పోస్టులను నాన్ మెడికల్ టీచర్లతో భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 34 విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమించనున్నారు. అత్యధికంగా గైనకాలజీ 187 పోస్టులు, అనస్థీషియాలో 177 పోస్టులు భర్తీ కానుండగా తర్వాత స్థానాల్లో జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్ విభాగాలు ఉన్నాయి.
మెరిట్ జాబితా కోసం క్లిక్ చేయండి.. 


జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష - దరఖాస్తు ప్రారంభం ఎప్పుడంటే?
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ 2023 పరీక్ష షెడ్యూలు ఇటీవల వెల్లడైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఐఐటీ గువాహటి నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా జూన్‌ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించనుంది. జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్‌ 30 నుంచి మే 7 వరకు ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే జేఈఈ మెయిన్‌-1 పూర్తికాగా, ఏప్రిల్‌లో జేఈఈ మెయిన్‌-2 నిర్వహించనున్నారు. ఈ రెండు సెషన్ల ఫలితాలను ఏప్రిల్ చివరివారంలో వెల్లడించే అవకాశం ఉంది. పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన 2.5 లక్షల మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత సాధిస్తారు. దీని ఫలితాల ఆధారంగా ఐఐటీల్లో నాలుగేళ్ల బీటెక్‌, బీఎస్‌, బీఆర్క్‌, ఐదేళ్ల డ్యూయల్‌ డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌ నోటిఫికేషన్, ఇతర వివరాల కోసం క్లిక్ చేయండి.. 


జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 అడ్మిట్ కార్డులు వచ్చేస్తున్నాయి, ఎప్పుడంటే?
దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2023 సెషన్-2కు సంబంధించి అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే విడుదల చేయనుంది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఏప్రిల్ 6 నుంచి 12 వరకు సెషన్-2 పరీక్షలు జరుగనున్నాయి. ఈ పరీక్షల అడ్మిట్ కార్డులను వారం రోజుల్లో అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నట్టు ఎన్టీఏ తెలిపింది. 
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..