విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సూసైడ్ చేసుకోవడం విజయవాడలో కలకలం రేపుతోంది. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన వారు విగత జీవులుగా మారడం వారి బంధువులకు విషాదాన్ని మిగిల్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన కుటుంబం విజయవాడ కనక దుర్గమ్మ దర్శనానికి వచ్చినట్లు సమాచారం.


తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతానికి చెందిన పప్పుల సురేష్, శ్రీలత దంపతులు తమ కుమారులతో పాటు ఏపీలోని విజయవాడ సన్నిధికి వెళ్లారు. పప్పుల అఖిల్ పెద్ద కుమారుడు కాగా, వయసు 28. పప్పుల ఆశిష్ చిన్న కుమారుడు వయసు 22 ఏళ్లు. ఇతడు నిజామాబాద్‌లో బీఫార్మసీ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే దుర్గమ్మ దర్శనం కోసం వచ్చిన పప్పుల రమేష్ కుటుంబం విజయవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రంలో దిగారు. ఏం జరిగిందో తెలియదు గానీ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన కుటుంబం సూసైడ్ చేసుకుంది.


తల్లి శ్రీలత, చిన్న కుమారుడు ఆశిష్ సత్రంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. రూమ్.నెం.312 లో పప్పుల శ్రీలత(54), ఆశిష్ (22) మృతదేహాలను పోలీసులు గుర్తించారు. ఇదే సమయంలో కృష్ణా నదిలో దూకిన తండ్రి పప్పుల రమేష్,పెద్ద కుమారుడు అఖిల్ గల్లంతయ్యారు. అతికష్టమ్మీద గజ ఈతగాళ్లు రమేష్ (56) మృతదేహాన్ని వెలికితీశారు. అఖిల్ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇతడు నిజామాబాద్‌లో ఓ పెట్రోల్ బంకును లీజుకు తీసుకుని నడుపుతున్నాడని సమాచారం. 



బంధువులకు మెస్సేజ్..
అఖిల్ పేరిట సత్రంలో గది బుక్ చేసుకున్నారు. అర్ధరాత్రి దాటిన తరువాత 2:30 గంటల ప్రాంతంలో బంధువులకు మెస్సేజ్ పెట్టి ఆత్మహత్య చేసుకున్నారు. అప్పుల బాధతో తమ కుటుంబం ఆత్మహత్య చేసుకుని చనిపోతుందని బంధువులకు మెస్సేజ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.


Also Read: Court Summons To God : నువ్వేనా ? కాదా ? కోర్టుకు వచ్చి నిరూపించుకోవాలని దేవుడికి కోర్టు సమన్లు ! మరి దేవుడు వచ్చాడా ?


Also Read: WHO On Omicron: ఒమిక్రాన్ ఎఫెక్ట్.. మరిన్ని ప్రమాదకర వేరియంట్లు పుట్టుకొస్తాయని డబ్ల్యూహెచ్‌ఓ వార్నింగ్..!


Also Read: వనమా రాఘవ ఆగడాలకు అడ్డేలేదా?... ఆది నుంచి ఆరోపణల పర్వమే...! 


Also Read: Covid Updates: తెలంగాణలో పెరుగుతున్న కరోనా ఉద్ధృతి... ఒక్క రోజులో 2 వేలకు పైగా కేసులు, ముగ్గురు మృతి


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి