Morena Firing: 


మొరెనాలో కాల్పులు 


మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఆస్తి తగాదాలో జరిగిన వాగ్వాదం చివరకు హత్యకు దారి తీసింది. మొరెనా గ్రామంలో జరిగిందీ ఘటన. స్థలం విషయంలో రెండు వర్గాలు ఘర్షణ పడ్డాయి. ఉన్నట్టుండి ఓ వ్యక్తి తుపాకీ తీసి ఇష్టమొచ్చినట్టు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆరుగుర ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్ట్‌మార్టానికి తరలించారు. తీవ్రంగా గాయపడిన వాళ్లకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. రంజిత్ తోమర్, రాధే తోమర్‌ మధ్య కొన్నేళ్లుగా స్థలం విషయంలో వాగ్వాదం జరుగుతోంది. 2014లో రంజిత్ తోమర్‌ కుటుంబం రాధే తోమర్ ఫ్యామిలీలోని ముగ్గురుని హత్య చేసింది. అప్పటి నుంచి పరారీలో ఉన్నారు నిందితులు. ఇటీవల మళ్లీ గ్రామానికి వచ్చారు. పగ తీర్చుకునేందుకు రాధే తోమర్ కుటుంబం వేచి చూస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో మరోసారి గొడవ జరిగింది. వెంటనే తుపాకీ తీసి గురి పెట్టారు. కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. దగ్గర్లోనే ఎక్కడో ఓ చోట తలదాచుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. గ్రామం అంతా జల్లెడ పడుతున్నారు.