నిజ నిర్ధారణ కమిటీ పేరుతో టీడీపీ నాయకులు రెచ్చగొట్టే విధంగా వ్యవహరించారని ఏలూరు రేంజ్ డీఐజీ మోహన్ రావు అన్నారు. ఆరుగురు సభ్యులు గల టీడీపీ కమిటీకి ప్రజాస్వామ్యబద్ధంగా ముందస్తుగా పోలీసులు అనుమతి ఇచ్చారని తెలిపారు. టీడీపీ నేతలు భారీ ర్యాలీగా తరలివచ్చి అరుపులు, కేకలు, నినాదాలతో రాజకీయంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని డీఐటీ అన్నారు. పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా టీడీపీ నేతలను అరెస్టు చేశారని ఆయన తెలిపారు. వైసీపీ, టీడీపీ నేతలు ఇరువురిని ముందస్తు చర్యగా అరెస్టు చేసి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. టీడీపీ నాయకులు రాజకీయంగా లబ్ధి పొందేందుకు ముందస్తుగా అరెస్టు చేయాలని పోలీసులను కోరినట్లు డీఐజీ వెల్లడించారు. 


Also Read: గుడివాడలో కేసినో మంటలు... టీడీపీ ఆఫీసుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తల దాడి ... టీడీపీ నేతల అరెస్ట్ !


అసలేం జరిగిందంటే...!


కృష్ణా జిల్లా గడివాడ శుక్రవారం రణరంగం అయింది. సంక్రాంతి సందర్భంగా కేసినో ఏర్పాటు చేసి జూదం నిర్వహించారన్న ఆరోపణలపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నియమించింది. ఆ కమిటీ శుక్రవారం గుడివాడలో పర్యటించాల్సి ఉంది. అయితే టీడీపీ నిజనిర్ధారణ కమిటీ పర్యటనకు ముందుగానే వైఎస్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు గుడివాడ కే- కన్వెన్షన్ సెంటర్‌లో సమావేశమయ్యారు. ఆ తర్వాత వారు ర్యాలీగా టీడీపీ ఆఫీసు వద్దకు వెళ్లారు. అక్కడ టీడీపీ ఆఫీసుపై రాళ్ల దాడి చేశారు. అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు లాఠీచార్జ్ చేసి రెండు వర్గాలను చెదరగొట్టారు. మరో వైపు నిజనిర్ధారణ కమిటీని పోలీసులు గుడివాడలోకి కూడా రానీయలేదు.  టీడీపీ కమిటీలో నక్కా ఆనందబాబు, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, బొండా ఉమా, ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, తంగిరాల సౌమ్య ఉన్నారు. పామర్రు వద్దనే అడ్డుకున్న పోలీసులు ఒక్క కారును మాత్రమే అనుమతిస్తామన్నారు. అక్కడ టీడీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తర్వాత వీరందర్నీ గుడివాడలోకి రాక ముందే అరెస్ట్ చేసి తరలించారు. అరెస్ట్ సమయంలో టీడీపీ నేత బొండా ఉమ కారుపై వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు . దీంతో కారు ధ్వంసం అయింది.  


Also Read: గుడివాడలో టీడీపీ వర్సెస్ వైఎస్‌ఆర్‌సీపీ - కేసినో రాజకీయంతో ఉద్రిక్తత.. మోహరించిన పోలీసులు !


ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తారని తెలిసినా పోలీసులు వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్ని నియంత్రించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మూడు రోజుల పాటు కేసినోలు నిర్వహించినా పోలీసులు ఆ వైపు చూడలేదని.. ఇప్పుడు టీడీపీ నేతలు నిజ నిర్ధారణ చేసేందుకు వస్తున్నారని తెలిసి కూడా వైఎస్ఆర్‌సీపీ నేతల్ని నియంత్రించలేదని ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలు గుడివాడలోకి రాకుండా ప్రధాన రహదారిపై బారికేడ్లు ..రోప్‌ పార్టీ పోలీసులను ఏర్పాటు చేశారు కానీ దాడులకు దిగుతున్న అధికార పార్టీ నేతలను మాత్రం అడ్డుకోలేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 


Also Read: Warangal: ఇంట్లోకి చొరబడి భర్తపై హత్యాయత్నం.. కత్తులతో ఉన్న దుండగులను ఎదుర్కొన్న భార్య


 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి