తండ్రిని కొట్టాడన్న కోపంతో..


దేశ రాజధాని దిల్లీలో ఓ 36 ఏళ్ల వ్యక్తిని మైనర్ తుపాకీతో కాల్చి గాయపరిచాడు. వాయువ్య దిల్లీలోని జహంగీర్‌పురిలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జహంగీర్‌పురిలో H-4 బ్లాక్ వద్ద ఈ ఘటన జరిగిందని పోలీసులకు సమాచారం అందింది. బాధితుడి కుడి కంటికి బుల్లెట్ గాయమైందని పోలీసులు వెల్లడించారు. తాను పార్క్‌లో కూర్చుని ఉండగా, ముగ్గురు మైనర్లు వచ్చి తనపై దాడిచేశారని, తుపాకీతో ముఖంపై కాల్చారాని బాధితుడు వాంగ్మూలం ఇచ్చాడు. తుపాకీతో కాల్చిన వెంటనే అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు...ఈ నేరానికి కారణమేంటో వెల్లడించారు. ముగ్గురు నిందితుల్లో ఒకరి తండ్రిని, అంతకు ముందు బాధితుడు కొట్టాడని ఆ పగతోనే ఇప్పుడు తుపాకీతో దాడి చేశారని చెప్పారు. ఏడు నెలల క్రితం జరిగిన ఘటనను గుర్తు పెట్టుకుని అదను చూసి దాడి చేశారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యాక, విచారణను వేగంవంతం చేశారు పోలీసులు.





 


బాధితుడు మెట్లపై కూర్చుని ఉండగా, ముగ్గురు అటువైపుగా వచ్చినట్టు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ ముగ్గురిలో ఒకరు ఉన్నట్టుండి తుపాకీ తీసి కాల్చాడు. వెంటనే అక్కడి నుంచి ఆ నిందితులు పారిపోయారు. ప్రస్తుతానికి బాధితుడు క్షేమంగానే ఉన్నాడని పోలీసులు తెలిపారు. అటెంప్ట్‌ టు మర్డర్ కింద ముగ్గురిపైనా కేసు నమోదు చేశారు. ఈ దాడిలో వినియోగించిన నాటు తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 



 Also Read: World Athletics Championships: ప్రపంచ అథ్లెటిక్స్‌ లాంగ్‌ జంప్‌ ఫైనల్‌ చేరిన తొలి భారతీయుడిగా రికార్డు!


Also Read: Viral Video : ఎవరి పిచ్చి వాళ్లకానందం అంటే ఇదే- మొహాన ఏం కొట్టించుకుంటున్నారో తెలుసా ?