బర్రెతో లైంగిక చర్యకు పాల్పడేందుకు ప్రయత్నించి దాని తోక ఉరిలాగా బిగుసుకొని ఓ వ్యక్తి చనిపోయిన ఘటన మరువకు ముందే అలాంటి తరహా మరో ఘటన వెలుగు చూసింది. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పలువురు కామాంధులు వారివరసలు, జాతి సంబంధం లేకుండా పెట్రేగిపోతుండడం కలవరపాటుకు గురి చేస్తోంది. మద్యం ఫూటుగా తాగేసి ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తూ సమాజంలో ప్రమాదకరంగా జీవిస్తున్నారు.


తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి గేదెను అత్యాచారం చేశాడు. సభ్య సమాజం మొత్తం సిగ్గుపడి అసహ్యించుకునేలా ఉన్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చర్ల మండలం విజయ కాలనీకి చెందిన రమేశ్ అనే వ్యక్తి శనివారం రాత్రి వేళ ఫూటుగా తాగి, ఓ గేదెపై లైంగిక చర్యకు ఒడిగట్టాడు. ఆ మూగ జీవంపై లైంగిక దాడి చేశాడు. ఒళ్లు తెలియకుండా అతను చేస్తున్న ఆ దాష్టీకాన్ని స్థానికులు చూసి ఆగ్రహంతో ఊగిపోయారు. వెంటనే రమేశ్‌ను లాక్కొచ్చి అతడు నగ్న స్థితిలో ఉండగానే చితకబాదారు. తాళ్లతో ఓ గుంజకు కట్టేసి నిర్బంధించారు. చితకబాదిన అనంతరం పోలీసులకు అప్పగించారు. ఇలా మూగ జీవంపై లైంగిక దాడి చేసిన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.


Also Read: Telangana News: వీళ్లందరికీ కేసీఆర్ శుభవార్త, ఉద్యమంలా తీసుకుపోదామని గోల్కొండ వేదికగా సీఎం వెల్లడి


వనపర్తిలో ఇలాంటి ఘటనే..
వనపర్తి జిల్లా కేంద్రంలో కూడా ఓ గేదెపై అసహజ లైంగిక క్రీడకు పాల్పడ్డ ఘటన జరిగింది. కానీ, అతను అక్కడే చనిపోయాడు. నాగవరానికి చెందిన ఆంజనేయులు అనే 45 ఏళ్ల వ్యక్తి వ్యవసాయ కూలీ పని చేస్తుంటాడు. అతను ఇటీవల ఓ గేదెపై అఘాయిత్యానికి పాల్పడుతూ గ్రామంలోని పలువురికి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. దీంతో గ్రామస్తులు ఇతడిని స్తంభానికి కట్టేసి దేహశుద్ది చేసి గట్టిగా హెచ్చరించి వదిలేశారని స్థానికులు తెలిపారు.


Also Read: Dalit Bandhu Scheme: దళిత బంధుపై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. కౌంటర్ ఇవ్వబోయి అంతమాట అనేశారే..!


అయితే, ఇంత జరిగాక కూడా అతను తన దుర్భుద్ధిని మార్చుకోలేదు. మళ్లీ శనివారం ఓ రైతు ఇంటి ఆవరణలో కట్టేసి ఉన్న గేదెపై అత్యాచారం చేయబోయాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు గేదె తోక అతని మెడకు బిగుసుకోవడం వల్ల ఉరి ఏర్పడింది. వెంటనే అక్కడికక్కడే ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. గేదె వెనకాలే అతను నగ్నంగా విగతజీవిగా పడి ఉన్నాడు. ఉదయం పశువుల కొట్టంలో ఆంజనేయులు విగత జీవిగా నగ్నంగా పడి ఉండడం చూసిన రైతు బాల్ రెడ్డి ఆందోళనతో చుట్టుపక్కల వాళ్లకు విషయం తెలిపాడు. వారంతా కలిసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృతదేహాన్ని ఆంజనేయులు కుటుంబసభ్యులకు అప్పగించారు.


Also Read: Wanaparthy News: గేదెపై వ్యక్తి అత్యాచారం.. నగ్నంగా అక్కడిక్కడే మృతి, అసలేం జరిగిందంటే..


Must Watch: జెండా ఎగరేస్తుండగా కొట్టుకున్న టీఆర్ఎస్-బీజేపీ నేతలు.. ఆస్పత్రి పాలైన బీజేపీ నేత