ప్రేమ గురించి ఇంట్లో చెప్పకుండా రహస్యంగా ఓ జంట చేసుకున్న వివాహం పెద్ద తప్పిదానికి దారి తీసింది. ఆ తర్వాత జరిగిన ఘటన ఇరు కుటుంబాల్లో విషాదం నింపింది. జంటలో ఆ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడగా.. ఆ విషయం తెలుసుకున్న యువకుడు ప్రాణాలు తీసుకొనేందుకు యత్నించాడు. చివరికి స్థానికులు రక్షించి అతణ్ని ఆస్పత్రికి తరలించగా.. ప్రస్తుతం చావు బతుకుల మధ్య మృత్యువుతో పోరాడుతున్నాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.


ఓ జంట తమ రెండు కుటుంబాల్లో ఎవరికీ చెప్పకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దూరపు బంధువులు. ఆ తర్వాత ఎవరి ఇంటికి వాళ్లు వచ్చి ఉంటున్నారు. ఈలోపు వారి పెళ్లి బట్టల్లో దిగిన ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వచ్చాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టా గ్రామ్‌లో వాటిని చూసిన బంధువులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. వారిద్దరూ వరుసకు అన్నాచెల్లెళ్లు అవుతారని బంధువులు గుర్తించారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. మరోవైపు, యువకుడు కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం ఇతను ప్రాణాలతో పోరాడుతున్నాడు. 


Also Read: నేడు తెలంగాణలో భారీ వర్షాలు.. ఏపీలో మరో రెండు రోజులపాటు మోస్తారు వానలు


పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన 21 ఏళ్ల యువతి, 24 ఏళ్ల యువకుడు ఏడాదిగా ప్రేమించుకుంటున్నారు. ఆ యువకుడికి తన సోదరి ద్వారా ఆ యువతి కొన్నాళ్ల క్రితం పరిచయం అయింది. వీరిద్దరూ పది రోజుల క్రితం హైదరాబాద్‌ శివారుకు వచ్చి ఇంట్లో కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లుగా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయి సాధారణంగానే ఉంటున్నారు. 


Also Read: MP Asaduddin Owaisi House: ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నివాసంపై దాడి... ఐదుగురు అరెస్ట్.. ఆ వ్యాఖ్యలే కారణమా?


ఈ క్రమంలో వారు పెళ్లి చేసుకున్న ఫోటోలను ఎవరో సామాజిక మాధ్యమంలో పెట్టారు. అయితే, ఈ ఫోటోలను వారే పెట్టినట్లుగా తెలుస్తోంది. నేరుగా ఇంట్లో వారికి చెప్పలేక పెళ్లి ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పెట్టినట్లు తెలుస్తోంది. ఈ ఫోటోలు చూసిన కుటుంబ సభ్యులు వారు దూరపు బంధువులు అవుతారని.. వరుసకు అన్నా చెల్లెళ్లు అవుతారని తేల్చారు. దీంతో మనస్తాపం చెందిన యువతి పురుగుల మందు తాగి మంగళవారం బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న యువకుడు కూడా పురుగులమందు తాగి తమ పొలంలోని వ్యవసాయ బావిలో దూకేశాడు. స్థానికులు అతడిని చికిత్స కోసం వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పడంతో అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌‌లోని ఓ కార్పొరేటు ఆస్పత్రికి తరలించారు.


Also Read: వైద్యుల నిర్లక్ష్యం నిండు గర్భిణి ప్రాణం తీసింది... కడుపులో దూది మరచిపోయి కుట్లు... ఏడాదిగా తీవ్ర కడుపు నొప్పితో మహిళ అవస్థ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి