Stock Market Today, 14 August 2023: ఇవాళ (సోమవారం) ఉదయం 8.15 గంటల సమయానికి, గిఫ్ట్‌ నిఫ్టీ (GIFT NIFTY) 52 పాయింట్లు లేదా 0.27 శాతం రెడ్‌ కలర్‌లో 19,427 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి, మన స్టాక్‌ మార్కెట్‌ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని GIFT NIFTY సూచిస్తోంది.


ఇవాళ Q1 రిజల్ట్స్‌ ప్రకటించే కీలక కంపెనీలు: సైస్‌జెట్‌, ITC, దివీస్ ల్యాబ్స్, వొడాఫోన్ ఐడియా. ఈ స్టాక్స్‌ ఇవాళ మార్కెట్‌ ఫోకస్‌లో ఉంటాయి.


ఇవాళ్టి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్‌ ఇవి: 


ONGC: 2023 జూన్‌ త్రైమాసికంలో ONGCకి ఏకీకృత నికర లాభం రూపంలో రూ. 14,134 కోట్లు మిగిలింది. కార్యకలాపాల ద్వారా వచ్చి ఆదాయం 10% తగ్గి రూ. 1.63 లక్షల కోట్లకు పరిమితమైంది.


పతంజలి ఫుడ్స్: ఈ ఏడాది ఏప్రిల్‌-జూన్‌ కాలంలో ఈ ఎఫ్‌ఎంజీసీ కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 64% తగ్గి రూ. 878 కోట్లకు పరిమితమైంది. అయితే, కంపెనీ ఆదాయం దాదాపు 8% పెరిగి రూ. 7,767 కోట్లకు చేరుకుంది.


పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్: దేశంలోని విద్యుత్‌ ప్రాజెక్టులకు ఫైనాన్స్‌ చేసే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌ (PFC), 1:4 నిష్పత్తిలో ఈక్విటీ షేర్ల బోనస్ జారీని ఆమోదించింది. అంటే, ఈ కంపెనీలో ప్రతి 4 షేర్లకు బదులు ఒక షేర్‌ను బోనస్‌గా జారీ చేస్తుంది. షేర్‌ ధర అదే నిష్పత్తిలో తగ్గుతుంది.


లుపిన్: మండిదీప్‌లోని లుపిన్ యూనిట్-2 తయారీ కేంద్రంలో USFDA GMP తనిఖీ విజయవంతంగా పూర్తయింది. USFDA ఒక్క అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదు.


అదానీ పోర్ట్స్: డెలాయిట్ హాస్కిన్స్ & సెల్స్ కంపెనీ అదానీ పోర్ట్స్ ఆడిటర్ పదవికి రాజీనామా చేసింది. ఆ కంపెనీ స్థానంలో MSKA & అసోసియేట్స్‌ను చట్టబద్ధమైన ఆడిటర్‌గా నియమించడానికి అదానీ పోర్ట్స్ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది.


క్రాంప్టన్: 2023-24 మొదటి త్రైమాసికంలో క్రాంప్టన్‌ రూ. 118 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా ఈ కంపెనీకి వచ్చిన ఆదాయం రూ. 1,877 కోట్లు.


PTC ఇండియా: జూన్ త్రైమాసికంలో PTC ఇండియా రూ. 130 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. కార్యకలాపాల ద్వారా రూ. 4,848 కోట్ల ఆదాయం వచ్చింది.


RVNL: Q1 FY24లో RVNL నికర లాభం రూ. 343 కోట్లుగా ఉంది. అదే కాలంలో కార్యకలాపాల ద్వారా రూ. 5,572 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది.


JK సిమెంట్: ఏప్రిల్-జూన్ కాలానికి 115 కోట్ల రూపాయల నికర లాభాన్ని JK సిమెంట్ ప్రకటించింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన రూ. 2,763 కోట్ల ఆదాయంపై ఈ లాభాన్ని మిగుల్చుకుంది.


టిమ్‌కెన్‌ ఇండియా: జంషెడ్‌పూర్ ప్లాంట్‌ను ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3 వరకు టిమ్‌కెన్ ఇండియా మూసివేస్తుంది. డిమాండ్ తక్కువగా ఉండడంతో, డిమాండ్‌ను, ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకునే ప్లాన్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.


ఇది కూడా చదవండి: లక్ష రూపాయలను ఏడాదిలోనే రెండు లక్షలుగా మార్చిన మ్యాజిక్‌ స్టాక్‌ ఇది


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.