Petrol Price Today 12th March 2022: ఉక్రెయిన్, రష్యా యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు బ్యారెల్ ధర 120 డాలర్లకు ఎగబాకింది. హైదరాబాద్‌లో ఇంధన ధరలు గత ఏడాది డిసెంబర్ నుంచి నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు సైతం పెట్రోల్ ధర లీటర్ రూ.108.20 కాగా, డీజిల్ ధర లీటర్ రూ.94.62 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీలోనూ గత డిసెంబర్ తొలి వారం నుంచి పెట్రోల్ లీటర్ ధర రూ.95.41, డీజిల్ ధర రూ.86.67 వద్ద స్థిరంగా ఉన్నాయి. 


తెలంగాణలో ఇంధన ధరలు..
ఇక వరంగల్‌లో పెట్రోల్ ధర (Petrol Price In Warangal) నిలకడగా ఉంది.  వరంగల్‌లో 19 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.107.69 కాగా, డీజిల్‌‌పై 17 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.14 కు పతనమైంది. 
వరంగల్ రూరల్ జిల్లాలో పెట్రోల్‌ లీటర్ ధర రూ.107.92 కాగా, డీజిల్‌‌ పై 14 పైసలు తగ్గడంతో లీటర్ ధర రూ.94.35 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
కరీంనగర్‌లో ఇంధన ధరలు (Petrol Price in Karimnagar) నిలకడగా ఉన్నాయి. కరీంనగర్‌లో పెట్రోల్ ధర రూ.108.39 కాగా, డీజిల్ ధర రూ.94.79 గా ఉంది.
నిజామాబాద్‌లో ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇంధన ధరల్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నిజామాబాద్‌లోపెట్రోల్ లీటర్ ధర రూ.109.93 కాగా, డీజిల్‌ లీటర్ ధర రూ.96.23 అయింది. 
మహబూబ్ నగర్‌లో  42 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర రూ.109.17కు చేరగా, 40 పైసలు పెరగడంతో డీజిల్ ధర రూ.95.53 అయింది.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడలో పెట్రోల్‌ (Petrol Price in Vijayawada 12th March 2022)పై 40 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.110.48 కాగా, ఇక్కడ డీజిల్ పై 37 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.56 అయింది. 
విశాఖపట్నంలో ఇంధన ధరలు భారీగా దిగొచ్చాయి. 48 పైసలు తగ్గడంతో పెట్రోల్ లీటర్ ధర రూ.109.40 అయింది. డీజిల్‌పై 44 పైసలు పెరిగి లీటర్ ధర రూ.95.51కి పతనమైంది.
చిత్తూరులో ఇంధన ధరలు భారీగా పెరిగాయి. పెట్రోల్‌ పై 42 పైసలు పెరగడంతో లీటర్ ధర ప్రస్తుతం రూ.111.31కు చేరింది. డీజిల్ పై 43 పైసలు పెరగడంతో లీటర్ ధర రూ.96.27 అయింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. 


ధరల పెరుగుదలకు కారణం..
మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రభావం సామాన్యులపై పడి వారి జేబులకు చిల్లు పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడులతో క్రూడాయిల్ ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దాని ప్రభావం పలు దేశాలపై పడింది. భారత్‌లోనూ ఇంధన ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ లీటర్ ధర రూ.150 నుంచి రూ.180కి పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇంధన ధరలు సామాన్యులను ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. 


Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు ఊరట - నేడు బంగారం ధరలకు బ్రేక్, మరోవైపు కొండెక్కిన వెండి రేట్లు 


Also Read: iPhone 12 Offer: ఐఫోన్ 12పై అమెజాన్‌లో బంపర్ ఆఫర్ - ఏకంగా రూ.12 వేలు తగ్గింపు!