Petrol Diesel Prices Today: కొన్నాళ్ల క్రితం వరకు మన దేశంలో ఇంధనం ధరలు ఎగబాకుతూ, క్రమంగా లీటరుకు రూ.120 దాటాయి. ఇటీవల, పెట్రోలు & డీజిల్‌ మీద ఎక్సైజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం మరోసారి తగ్గించింది. దీంతో ధరల్లో భారీగా మార్పు కనిపించింది. పెట్రోల్ ధర రూ.9 కి పైగా, డీజిల్ ధర రూ.7 రూపాయలకు పైగా తగ్గింది. దీంతో పెట్రోలు ధర రూ.109-110 శ్రేణిలో, డీజిల్‌ ధర రూ.100 దిగువన స్థిరంగా ఉంటున్నాయి.


తెలంగాణలో ధరలు (Petrol Price in Telangana) 
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు (Petrol Pricein Hyderabad) గత మూడు నెలలకు పైగా నిలకడగా ఉంటున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర రూ.109.66గా ఉంది. ఇక డీజిల్ ధర రూ.97.82 గా ఉంది. ఇక వరంగల్‌లోనూ (Petrol Price in Warangal) ధరలు నేడు  స్థిరంగా ఉన్నాయి. నేడు (ఆగస్టు 30) పెట్రోల్ ధర నేడు రూ.109.10 గా ఉంది. డీజిల్ ధర రూ.97.29 గా నిలకడగానే ఉంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ధరలు కొనసాగుతున్నాయి.


నిజామాబాద్‌లో (Petrol Price in Nizamabad) పెట్రోల్ ధర నేడు అతి స్వల్పంగా రూ.0.19 పైసలు పెరిగి రూ.111.27 కి చేరింది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి నేడు రూ.99.31 గా ఉంది. ఇతర ప్రాంతాలతో పోలిస్తే, గత కొన్ని రోజులుగా నిజామాబాద్‌లో ఇంధన ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు (Petrol Price in Andhra Pradesh) 
విజయవాడ మార్కెట్‌లో ఇంధన ధరలు (Petrol Price in Vijayawada) నేడు మరికాస్త తగ్గాయి. పెట్రోల్ ధర నేడు రూ.0.44 పైసలు తగ్గి రూ.111.38 గా ఉంది. డీజిల్ ధర రూ.0.38 పైసలు తగ్గి రూ.99.16 గా ఉంది.


విశాఖపట్నం మార్కెట్‌లో పెట్రోల్ ధర (Petrol Price in Visakhapatnam) నేడు పెరిగింది. ఇవాళ పెట్రోల్ ధర నిన్నటితో పోలిస్తే ఇవాళ స్థిరంగా రూ.111.28 గా ఉంది. డీజిల్ ధర నేడు రూ.0.74 పైసలు పెరిగి రూ.99.01 గా ఉంది. అయితే, ఇక్కడ కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.


తిరుపతిలో  పెట్రోల్ ధర (Petrol Price in Tirupati) నేడు రూ.0.39 పైసలు తగ్గి రూ.111.96 గా ఉంది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో ఎక్కువగా మార్పులు కనిపిస్తున్నాయి. ఇక డీజిల్ ధర రూ.0.37 పైసలు తగ్గి రూ.99.64 గా ఉంది.


పెట్రోలు, డీజిల్‌ ధరల్లో హెచ్చుతగ్గులకు కారణం ఏంటంటే..
గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎన్నడూలేనంతగా పెరిగాయి. ఈ కారణంగానే ద్రవ్యోల్బణం పెరిగింది. ఈ ప్రభావం సామాన్యులపై బాగా పడుతోంది. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. అప్పుడు బ్యారెల్ ముడి చమురు ధర 32.30 డాలర్ల వద్దే ఉండేది. ప్రస్తుతం 100 డాలర్లకు అటు ఇటుగా కదులుతోంది. నిన్నటితో పోలిస్తే, ఇవాళ (ఆగస్టు 30) ముడి చమురు బ్యారెల్ ధర అతి స్వల్పంగా తగ్గి 93.53 డాలర్ల స్థాయికి చేరింది.