కొద్ది రోజులుగా ఇంధన ధరలు దేశంలో క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా మరోసారి స్వల్ప వ్యత్యాసాలు చోటుచేసుకున్నయాయి. హైదరాబాద్‌లో నేడు ధరలు నిలకడగా ఉన్నాయి. హైదరాబాద్‌లో నేడు పెట్రోల్ ధర లీటరుకు రూ.108.64 అయింది. డీజిల్ ధర ప్రస్తుతం రూ.101.66కి చేరింది. ఇక వరంగల్‌లో తాజాగా పెట్రోల్ ధర రూ.0.20 పైసలు తగ్గి రూ.108.16గా ఉంది. డీజిల్ ధర రూ.0.19 పైసలు తగ్గి రూ.101.19 గా ఉంది. వరంగల్‌లో గత కొన్ని రోజులుగా నిలకడగా ధరలు ఉంటుండగా.. తాజాగా తగ్గాయి. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.


కరీంనగర్‌లో పెట్రోల్ ధర ముందు రోజు ధరతో పోలిస్తే రూ.0.09 పైసలు పెరిగి.. రూ.108.91గా ఉంది. డీజిల్ ధర రూ.0.09 పైసలు పెరిగి రూ.101.90 కు చేరింది. నిజామాబాద్‌లోనూ ఇంధన ధరలు కాస్త పెరిగాయి. పెట్రోల్ ధర లీటరుకు రూ.0.19 పైసలు పెరిగి రూ.110.30 గా ఉంది. డీజిల్ ధర రూ.0.18 పైసలు పెరిగి రూ.103.19 గా ఉంది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇంధన ధరల్లో ఎక్కువగా హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..


ఇక విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధరలు తాజాగా పెరిగాయి. ప్రస్తుతం రూ.111.08 గా ఉంది. పెట్రోల్ ధర రూ.0.18 పైసలు పెరిగింది. డీజిల్ ధర రూ.0.17 పైసలు పెరిగి రూ.103.49కు చేరింది. అయితే, అమరావతి ప్రాంతంలో కొద్ది రోజుల ఇంధన ధరలు గమనిస్తే స్వల్పంగా పెరుగుతూనే ఉన్నాయి. విశాఖపట్నం ఇంధన మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.109.50గా ఉంది. గత ధరతో పోలిస్తే రూ.0.23 పైసలు తగ్గింది. డీజిల్ ధర విశాఖపట్నంలో రూ.101.97గా ఉంది. విశాఖలో కూడా కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరల్లో సరాసరి హెచ్చు తగ్గులు ఉంటున్నాయి. తిరుపతిలో ఇంధన ధరల్లో తగ్గుదల కనిపించింది. లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ.1.29 పైసలు తగ్గి.. రూ.111.84 కు చేరింది. కొద్ది రోజులుగా ఇక్కడ పెట్రోలు ధరల్లో పెరుగుదల కనిపిస్తుండగా తాజాగా పెరిగింది. ఇక డీజిల్ ధర రూ.103.97గా ఉంది. డీజిల్ ధర లీటరుకు ఏకంగా రూ.0.17 పైసలు తగ్గింది.


Also Read: టాలీవుడ్‌కు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ధియేటర్లలో వంద శాతం ఆక్యుపెన్సీకి అనుమతి !


ధరల పెరుగుదలకు కారణం ఏంటంటే..


గత సంవత్సర కాలంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎప్పుడూ లేనంతగా పెరిగిపోతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో ముడి చమురు ధరలు జీవితకాల కనిష్ఠానికి చేరినా మన దేశంలో మాత్రం తగ్గలేదు. పైగా పెరుగుతూ వస్తున్నాయి. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక పన్నులను పెంచి ఇంధన ధరలు తగ్గకుండా చేశాయి. ఆ సమయంలో బ్యారెల్ ముడి చమురు ధర 32.33 డాలర్ల వద్దే ఉండేది. ఆ తర్వాత క్రమంగా ముడి చమురు ధర పెరుగుతూ, స్వల్పంగా తగ్గుతూ తాజాగా అక్టోబరు 14 నాటి ధరల ప్రకారం 80.14 డాలర్ల వద్ద ఉంది. వీటి ధరలు పెరుగుతున్నా కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాలు మాత్రం ఆ పెంచిన పన్నులను తగ్గించలేదు. 


Also Read: బంగారం ప్రియులకు గుడ్ న్యూస్... నిలకడగా గోల్డ్, సిల్వర్ ధరలు... ప్రధాన నగరాల్లో ఇవాళ్టి ధరలు ఇలా


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి