Gold-Silver Price 5 September 2022: దేశంలో బంగారం ధర (Today's Gold Rate) నిన్నటితో (ఆదివారం) పోలిస్తే నేడు (సోమవారం) పెరిగింది. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ₹ 230 పెరిగింది. కిలో వెండి ధర ₹ 200 పెరిగింది.


తెలంగాణలో బంగారం ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర ఇవాళ (సోమవారం) ₹ 210 పెరిగి ₹ 46,860 కి చేరింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర కూడా ₹ 230 పెరిగి ₹ 51,120 గా ఉంది. కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు ₹ 58,400 కు చేరింది. తెలంగాణవ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.


ఆంధ్రప్రదేశ్‌లో బంగారం ధరలు (Gold Rates in Andhra Pradesh)
విజయవాడలో ‍(Gold Rate in Vijayawada) 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు (సోమవారం) ₹ 230 పెరిగి ₹ 46,860 కి చేరింది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం కూడా ₹ 230 పెరిగి ₹ 51,120 గా నమోదైంది. ఇక్కడ కిలో వెండి ధర ₹ 58,400 కు చేరింది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,860 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,120 గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్‌, విజయవాడ తరహాలోనే కిలో ₹ 58,400 గా ఉంది. 


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Today's Gold Rate in Major Cities) 
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ఇవాళ ₹ 250 పెరిగి ₹ 47,470 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర కూడా ₹ 270 పెరిగి ₹ 51,780 కి చేరింది.
ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర ₹ 46,800 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,780 కి చేరింది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,950 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,250 గా నమోదైంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,900 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,140 గా ఉంది. 
మైసూరులో (Gold Rate in Mysore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,900 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,150 గా ఉంది. 
పుణెలో (Gold Rate in Pune) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర ₹ 46,880 గా, 24 క్యారెట్ల బంగారం ధర ₹ 51,150 గా ఉంది. 


ప్లాటినం ధర (Today's Platinum Rate)
సంపన్నులు బాగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం 'ప్లాటినం' ధర నిన్నటితో (ఆదివారం) పోలిస్తే నేడు (సోమవారం) పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాములకు ₹ 180 పెరిగి ₹ 21,600 కి చేరింది. విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉన్నాయి.


అంతర్జాతీయ పరిణామాల ప్రభావం
మన దేశంలో పసిడి, వెండి సహా అలంకరణ లోహాల ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక రకాల పరిణామాల మీద ఈ ధరల మార్పు ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఈ కారణాల్లో ఒకటి. ఇలా ప్రపంచ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు పెరగడానికి కూడా చాలా కారకాలు పని చేస్తాయి. తాజాగా రష్యా - ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావమే ఈ బంగారం విపరీతంగా పెరగడానికి కారణమైంది. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జ్యువెలరీ మార్కెట్లలో వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తుంటాయి.