అన్వేషించండి

EPF Vs EPS: వీటిలో ఏది మీ భవిష్యత్తును సురక్షితంగా ఉంచుతుంది?, మీకు ఈ విషయాలు కచ్చితంగా తెలియాలి

Retirement Planning: ఈ రెండు పథకాల ఉద్దేశం, పదవీ విరమణ అనంతరం ఉద్యోగులకు ఆర్థిక మద్దతు ఇవ్వడం. అయితే, వీటిలో ఉద్యోగులు అర్థం చేసుకోవలసిన కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి.

Differences Between EPF and EPS: ఒక వ్యక్తికి, ఏదైనా ఉద్యోగం చేస్తున్నంతకాలం, కుటుంబాన్ని పోషించుకోవడానికి స్థిరమైన ఆదాయం వస్తుంది. ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత పరిస్థితి ఏంటి, అతనికి ఆదాయం ఎలా వస్తుంది, శరీరంలో బలం తగ్గిపోయిన తర్వాత అతనికి ఉద్యోగం ఎవరు ఇస్తారు? - ఈ ప్రశ్నలకు సమాధానమే EPFO (Employees' Provident Fund Organization). రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఉద్యోగులకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు, భారత ప్రభుత్వం రెండు ప్రధాన పదవీ విరమణ పథకాలను అమలు చేస్తోంది. అవి.. ఉద్యోగుల భవిష్య నిధి (Employees' Provident Fund - EPF), ఉద్యోగుల పింఛను పథకం (Employee Pension Scheme - EPS).

రెండు పథకాలు, ఉద్యోగులకు వారి రిటైర్మెంట్‌ తర్వాతి జీవితంలో డబ్బు కొరత లేకుండా చూస్తాయి. అయినప్పటికీ, ఈ రెండు పథకాల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి, వాటి గురించి ఉద్యోగులు తప్పనిసరిగా తెలుసుకోవాలి.

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) అంటే ఏంటి?
ఈపీఎఫ్‌ అనేది కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా కార్యక్రమం. ఉద్యోగుల కోసం రిటైర్మెంట్‌ కార్పస్‌ (పదవీ విరమణ చేసేనాటికి పెద్ద మొత్తంలో డబ్బు) సేకరించడానికి దీనిని రూపొందించారు. ఈ పథకం కింద, ఉద్యోగి & అతని కంపెనీ యాజమాన్యం ఇద్దరూ కొంత నిర్ధిష్ట మొత్తాన్ని నెలనెలా జమ చేస్తారు. కాలక్రమేణా పెద్ద మొత్తంలో ఫండ్‌ సృష్టిస్తారు. పదవీ విరమణ తర్వాత, ఉద్యోగులు ఈ మొత్తాన్ని ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు, ఆర్థికంగా ఇబ్బంది పడకుండా జీవిత ప్రయాణం కొనసాగించవచ్చు.

ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్ (EPS) అంటే ఏంటి?
ఇది EPFలో ఒక భాగం. రిటైర్మెంట్‌ తర్వాత, ఆ ఉద్యోగికి నెలవారీ పెన్షన్ అందించడం దీని ఉద్దేశం. పొదుపును ప్రోత్సహించేందుకు EPF ఉంటే; అర్హత కలిగిన ఉద్యోగులకు రిటైర్మెంట్‌ తర్వాత కూడా నెలవారీ ఆదాయం అందేలా హామీ ఇచ్చేందుకు EPF ఉంది.

EPF - EPS మధ్య కీలక భేదాలు

  EPF EPS
కాంట్రిబ్యూషన్‌ ఉద్యోగులు జీతం + డియర్‌నెస్ అలవెన్స్ (DA)లో 12 శాతం, కంపెనీ యాజమాన్యం 3.67 శాతం జమ చేస్తారు. ఉద్యోగులు కాంట్రిబ్యూట్‌ చేయరు. కంపెనీ యాజమాన్యం, ఉద్యోగి EPF జీతం + DA లో 8.33 శాతం జమ చేస్తుంది.
కంట్రిబ్యూషన్ పరిమితి నిర్ధిష్ట పరిమితి లేదు; జీతం + DA శాతం ఆధారంగా నిర్ణయమవుతుంది. నెలవారీ కాంట్రిబ్యూషన్‌ రూ. 1,250కి పరిమితం.
అర్హత EPF కింద కవర్ అయిన ఉద్యోగులందరికీ అందుబాటులో ఉంటుంది. జీతం + డీఏగా రూ.15,000 వరకు సంపాదించే ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
నగదు ఉపసంహరణ ఐదేళ్ల సర్వీసుకు ముందు విత్‌డ్రా చేయాలంటే ఆదాయ పన్ను చెల్లించాలి. 10 సంవత్సరాల కంటే తక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులకు లేదా 58 ఏళ్ల వయస్సు వచ్చిన ఉద్యోగులకు ముందస్తు ఉపసంహరణకు అనుమతి ఉంటుంది.
ప్రయోజనం రకం పదవీ విరమణ లేదా 60 రోజుల నిరుద్యోగం తర్వాత ఏకమొత్తంగా చెల్లిస్తారు. పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి, లేదా ఉద్యోగి మరణించిన సందర్భంలో నామినీలకు రెగ్యులర్ పెన్షన్ వస్తుంది.
వడ్డీ  ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం వడ్డీ వస్తుంది, ప్రస్తుతం  8.15 శాతం వార్షిక వడ్డీ. కాంట్రిబ్యూషన్‌పై వడ్డీ ఉండదు.
ఆదాయ పన్ను పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తంపై పూర్తిగా పన్ను మినహాయింపు.  పెన్షన్ చెల్లింపులు, ఒకేసారి విత్‌డ్రా చేసిన మొత్తాలు పన్ను పరిధిలోకి వస్తాయి.

EPF & EPS ఎలా కలిసి పని చేస్తాయి?
ఉద్యోగికి సమగ్రమైన ఆర్థిక భద్రతను అందించడానికి EPF & EPS ఒకదానితో ఒకటి కలిసి పని చేస్తాయి. EPF, ఉద్యోగి రిటైర్మెంట్ నాటికి పెద్ద మొత్తంలో కార్పస్‌ సృష్టిస్తుంది. EPS, పదవీ విరమణ తర్వాత కూడా స్థిరమైన నెలవారీ ఆదాయం అందిస్తుంది. ఈ రెండు పథకాలు కలిసి ఉద్యోగులకు బలమైన ఆర్థిక భద్రత వలయాన్ని సృష్టిస్తాయి, వృద్ధాప్యంలో వారి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కాపాడతాయి.

ఈ రెండు పథకాల మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకోవడం వల్ల ఉద్యోగులు తమ రిటైర్‌మెంట్ ప్లానింగ్ గురించి కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, ప్రయోజనాలను పెంచుకోవడానికి వీలవుతుంది.

మరో ఆసక్తికర కథనం: ATM నుంచి పీఎఫ్‌ డబ్బు విత్‌డ్రా! - ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌ 

టాప్ హెడ్ లైన్స్

Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
షాబాద్ 6 హత్యల నిందితుడు రాజ్ కుమార్ ఆత్మహత్యపై కేసు నమోదు
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
భారత్‌లోకి సింగపూర్ ప్రముఖ లైఫ్‌స్టైల్ మ్యాగజైన్లు.. ఎస్‌పీహెచ్ మీడియాతో ఆశ్రయు మీడియా భాగస్వామ్యం
Embed widget