By: Arun Kumar Veera | Updated at : 30 Jan 2025 01:39 PM (IST)
కమోడిటీస్ మార్కెట్లో ప్రత్యేక సెషన్ ( Image Source : Other )
Stock Market News Updates: బడ్జెట్ సమర్పణ తేదీకి అతి చేరువలోకి వచ్చాం. ఫిబ్రవరి 01న, ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman), 2025-26 ఆర్థిక సంవత్సరానికి దేశ బడ్జెట్ సమర్పించనున్నారు. ఈ బడ్జెట్ ద్వారా దేశ ప్రజలందరి ఆశలు & ఆకాంక్షలను నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. స్టాక్ మార్కెట్ & కమోడిటీ మార్కెట్లోని పెట్టుబడిదార్లకు అది చాలా పెద్ద రోజు. ఈసారి బడ్జెట్ రోజు, ఫిబ్రవరి 01వ తేదీ శనివారం నాడు వచ్చింది. ఆ రోజు దేశీయ స్టాక్ మార్కెట్లు తెరుచుకుంటాయా, లేదా అన్న ప్రశ్న పెట్టుబడిదార్లలో ఉంది.
కమోడిటీస్ మార్కెట్లో ప్రత్యేక సెషన్
శనివారం & ఆదివారం స్టాక్ మార్కెట్లకు సాధారణ సెలవు రోజులు. ఆ రెండు రోజుల్లో, ఈక్విటీ షేర్ల లావాదేవీలు జరిగే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE), నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE) & కమోడిటీస్ లావాదేవీలు జరిగే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX) సెలవు తీసుకుంటాయి. అయితే, ఈ శనివారం మాత్రం ఈ మూడు ఎక్సేంజ్లు పని చేస్తాయి, ఆ రోజున బడ్జెట్ ఉండడమే కారణం. ఫిబ్రవరి 01, శనివారం నాడు MCXలో ట్రేడింగ్ జరుగుతుంది, దీనికోసం ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ను నిర్వహించబోతోంది. బడ్జెట్ రోజున, మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి కమోడిటీ మార్కెట్ పెట్టుబడిదార్లు కూడా నష్టపోకుండా & ప్రయోజనం పొందేందుకు ఈ స్పెషల్ సెషన్ నిర్వహిస్తున్నారు. కమోడిటీ మార్కెట్ ఇండెక్స్ MCX ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లైవ్లో ఉంటుంది & సాధారణ రోజుల మాదిరిగానే ట్రేడ్ జరుగుతుంది.
MCX ప్రెస్ నోట్
జనవరి 29న విడుదల చేసిన మీడియా ప్రకటనలో. బడ్జెట్ సమర్పణ సమయంలో రియల్ టైమ్ రిస్క్ మేనేజ్మెంట్ కోసం మార్కెట్ పార్టిసిపెంట్స్కు మద్దతు ఇచ్చేలా ఫిబ్రవరి 01న ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహిస్తున్నట్లు MCX తెలిపింది. దీంతో పాటు హెడ్జింగ్ అవసరాలను కూడా తీర్చుకోవచ్చు. అయితే, ఫిబ్రవరి 1వ తేదీన సెటిల్మెంట్ హాలిడే అని ఇన్వెస్టర్లు గుర్తుంచుకోవాలి. ఆ రోజున పే-ఇన్ లేదా పే-ఔట్ సాధ్యం కాదు.
జనవరి 31, 2025తో ముగిసే కాంట్రాక్టుల డెలివరీ సెటిల్మెంట్ క్యాలెండర్లో ఎలాంటి మార్పు ఉండదని MCX తన సర్క్యులర్లో పేర్కొంది. జనవరి 31, 2025 & ఫిబ్రవరి 01, 2025 నాటి ట్రేడ్ తేదీల సెటిల్మెంట్ ఫిబ్రవరి 03, 2025న జరుగుతుంది.
NSE & BSEలో కూడా సాధారణ ట్రేడింగ్
కమొడిటీస్ మార్కెట్ మాత్రమే కాకుండా.. భారతీయ స్టాక్ మార్కెట్లు NSE & BSE కూడా ఫిబ్రవరి 01వ తేదీ, శనివారం నాడు ఓపెన్లో ఉంటాయి. ఈ రెండు ఎక్సేంజీల్లో సాధారణ రోజుల మాదిరిగానే ట్రేడింగ్ జరుగుతుంది. NSE & BSE ఉదయం 9.15 గంటలకు ఓపెన్ అవుతాయి & మధ్యాహ్నం 3.30 వరకు పని చేస్తాయి. తద్వారా, ఈక్విటీ మార్కెట్ ఇన్వెస్టర్లు కూడా మార్కెట్ హెచ్చుతగ్గుల నుంచి తమ పెట్టుబడులను కాపాడుకునే అవకాశం పొందుతారు, నష్టపోయే అవకాశాలను తగ్గించుకునే అవకాశం పొందుతారు. బాగా అనుభవం ఉన్న వ్యక్తులు ఈ హెచ్చుతగ్గుల నుంచి శనివారం నాడు కూడా డబ్బు సంపాదించే ఛాన్స్ పొందుతారు.
మరో ఆసక్తికర కథనం: 5 కంపెనీలు 'ఫ్రీ'గా షేర్లు ఇస్తున్నాయి, వీటిలో ఒక్కటయినా మీ పోర్ట్ఫోలియోలో ఉందా?
Saving Money: మీకు 'కకీబో' గురించి తెలుసా? - డబ్బు ఆదా చేయడానికి జపనీయులు వాడే టెక్నిక్ ఇది
Free Shares: 5 కంపెనీలు 'ఫ్రీ'గా షేర్లు ఇస్తున్నాయి, వీటిలో ఒక్కటయినా మీ పోర్ట్ఫోలియోలో ఉందా?
Gold-Silver Prices Today 30 Jan: వెడ్డింగ్ సీజన్లో పెరిగిన పసిడి మెరుపు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవీ
No Income Tax: ఆదాయ పన్ను పూర్తిగా రద్దు, రూ.కోట్లు సంపాదించినా నో టాక్స్ - ఈ రాష్ట్ర ప్రజలకు బంపర్ ఆఫర్
Gold Prices: బడ్జెట్ ముందు బంగారానికి భలే డిమాండ్ - దాదాపు రూ.4400 పెరిగిన పుత్తడి రేటు
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - భుజంగరావు, రాధాకిషన్కు బెయిల్
Pothugadda Review - 'పోతుగడ్డ' రివ్యూ: లేచిపోయిన ఎమ్మెల్యే కూతురు... ఎన్నికల్లో పరువు... ETV Win పొలిటికల్ డ్రామాలో తండ్రి ఓటు ఎటు?
Trump on US Plane Crash: విమాన ప్రమాదంలో 64 మంది మృతి! 18 మృతదేహాలు వెలికితీత, ఘటనపై ట్రంప్ అసహనం
Union Ministers Convoy Accident: విశాఖలో కేంద్ర మంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ కాన్వాయ్లో ప్రమాదం- దెబ్బతిన్న 3 వాహనాలు
This website uses cookies or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy