search
×

Stock Market Closing: రియాల్టీ షేర్లకు గిరాకీ! ఫ్లాట్‌గా చలించినా లాభాల్లోనే ముగిసిన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market Closing Bell 24 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 27 పాయింట్ల లాభంతో 17,604 వద్ద ముగిసింది.

FOLLOW US: 
Share:

Stock Market Closing Bell 24 August 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. ద్రవ్యోల్బణం, ఫెడ్‌ భయాలు ఉన్నప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 27 పాయింట్ల లాభంతో 17,604 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 54 పాయింట్ల లాభంతో 59,085 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 4 పైసలు లాభపడి 79.81 వద్ద ముగిసింది.

BSE Sensex

క్రితం సెషన్లో 59,031 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,853 వద్ద మొదలైంది. 58,760 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,170 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 54 పాయింట్ల లాభంతో 59,085 వద్ద ముగిసింది.

NSE Nifty

మంగళవారం 17,577 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,525 వద్ద ఓపెనైంది. 17,499 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,623 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 27 పాయింట్ల లాభంతో 17,604 వద్ద క్లోజైంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ భారీ లాభాల్లో క్లోజైంది. ఉదయం 38,552 వద్ద మొదలైంది. 38,552 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,120 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 340 పాయింట్ల లాభంతో 39,038 వద్ద ముగిసింది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 26 కంపెనీలు లాభాల్లో 24 నష్టాల్లో ముగిశాయి. అపోలో హాస్పిటల్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ, ఐసీఐసీఐ షేర్లు లాభాల్లో క్లోజయ్యాయి. దివిస్‌ ల్యాబ్‌, బీపీసీఎల్‌, టాటా స్టీల్‌, టీసీఎస్‌, టైటాన్‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి. బ్యాంకు, ఎఫ్ఎంసీజీ, మీడియా, మెటల్‌, రియాల్టీ, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి. 

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BSEIndia (@bseindia)

Published at : 24 Aug 2022 04:04 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news

ఇవి కూడా చూడండి

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Women Investments: బంగారం తర్వాత మహిళల్ని ఎక్కువగా ఆకర్షించింది ఇదే, ఐదేళ్లలో డబ్బులు 'డబుల్‌'

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

Return On Gold ETFs: కళ్లు తిరిగే లాభం చూపించిన గోల్డ్ ఈటీఎఫ్‌లు, టాప్-10 లిస్ట్‌ ఇదే

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

MITRA Digital Platform: ఇన్వెస్టర్ల కోసం మిత్ర 'ప్లాట్‌ఫామ్' ప్రారంభించిన సెబీ - దీనిని ఎలా ఉపయోగించుకోవాలి?

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Investment Ideas 2025: NFO అంటే ఏంటి? - రూ.100తో పెట్టుబడి ప్రారంభించొచ్చు, దీర్ఘకాలంలో డబ్బుల వర్షం!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

Mutual Funds SIP: 'సిప్‌'లో చారిత్రాత్మక మార్పు - కేవలం రూ.250తో మ్యుచువల్‌ ఫండ్స్‌ను కొనొచ్చు!

టాప్ స్టోరీస్

CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు

CM Chandrababu: తిరుమల ఆలయంలో హిందువులు మాత్రమే సేవలు అందించాలి, అన్య మతస్తులకు నో ఛాన్స్: చంద్రబాబు

IPL 2025 Fand Park: ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే

IPL 2025 Fand Park: ఐపీఎల్‌ 2025 సీజన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన ఫ్యాన్ పార్క్‌లు ఇవే

Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?

Harish Rao on Fire: నాలుగున్నర లక్షలు కాదు కదా... నాలుగు ఇళ్లు కూడా కట్టలేదు. భట్టన్నా.. మధిరలో ఒక్క ఇళ్లైనా కట్టిన్రా..?

10th Examinations 2025: తెలుగు పరీక్ష కోసం వెళ్తే హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు- మంచిర్యాల జిల్లాలో షాక్ తిన్న విద్యార్థులు

10th Examinations 2025: తెలుగు పరీక్ష కోసం వెళ్తే హిందీ ప్రశ్నపత్రం ఇచ్చారు- మంచిర్యాల జిల్లాలో షాక్ తిన్న విద్యార్థులు