Stock Market Closing 12 October 2022: మూడు రోజుల వరుస నష్టాలకు తెరపడింది. భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం భారీగా లాభపడ్డాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందడంతో ఉదయం ఫ్లాట్‌గా ఓపెనయ్యాయి. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా మదుపర్లు కొనుగోళ్లు చేపట్టడంతో బెంచ్‌ మార్క్‌ సూచీలు ఎగిశాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 140 పాయింట్ల లాభంతో 17,123 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 478 పాయింట్ల లాభంతో 57,625 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 82.31 వద్ద స్థిరపడింది.


BSE Sensex


క్రితం సెషన్లో 57,147 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 57,312 వద్ద లాభాల్లో మొదలైంది. 57,085 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 57,687 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 478 పాయింట్ల లాభంతో 57,625 వద్ద ముగిసింది.


NSE Nifty



మంగళవారం 16,983 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,025 వద్ద ఓపెనైంది. 16,960 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,142 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 140 పాయింట్ల లాభంతో 17,123 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 38,784 వద్ద మొదలైంది. 38,606 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,164 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 406 పాయింట్ల లాభంతో 39,118 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 42 కంపెనీలు లాభాల్లో 7 నష్టాల్లో ముగిశాయి. పవర్‌ గ్రిడ్‌, కోల్‌ ఇండియా, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, ఎన్టీపీసీ షేర్లు లాభపడ్డాయి. ఏసియన్‌ పెయింట్స్‌, అదానీ ఎంటర్‌టైన్‌మెంట్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, ఫార్మా, రియాల్టీ, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ రంగాల సూచీలు ఎగిశాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.