Stock Market Closing Bell 22 July 2022: భారత స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే వచ్చినప్పటికీ మదుపర్లు కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 114 పాయింట్ల లాభంతో 16,719 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 390 పాయింట్ల లాభంతో 56,072 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 10 పైసలు పెరిగి 79.85 వద్ద క్లోజైంది.  


BSE Sensex


క్రితం సెషన్లో 55,681 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,800 వద్ద భారీ లాభాల్లో మొదలైంది. 55,685 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 56,186 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 390 పాయింట్ల లాభంతో 56,072 వద్ద ముగిసింది.


NSE Nifty


గురువారం 16,605 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 16,661 వద్ద ఓపెనైంది. 16,610 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,752 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 114 పాయింట్ల లాభంతో 16,719 వద్ద క్లోజైంది.



Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో క్లోజైంది. ఉదయం 36,322 వద్ద మొదలైంది. 36,286 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 36,823 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 537 పాయింట్ల లాభంతో 36,738 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ముగిశాయి. అల్ట్రాటెక్‌ సెమ్, గ్రాసిమ్‌, యూపీఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభపడ్డాయి. టాటా కన్జూమర్‌, ఇన్ఫీ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్‌, బీపీసీఎల్‌ షేర్లు నష్టపోయాయి. ఐటీ, ఫార్మా, హెల్త్‌కేర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, మెటల్‌, రియాల్టీ సూచీలు ఎగిశాయి.