Stock Market Closing Bell 28 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందకపోవడంతో ఉదయం మార్కెట్లు భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత బలంగా పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 18 పాయింట్ల లాభంతో 15,892, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 16 పాయింట్ల లాభంతో 53,177 వద్ద ముగిశాయి. రూపాయి మరోసారి కనిష్ఠాన్ని నమోదు చేసింది.


BSE Sensex


క్రితం సెషన్లో 53,161  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,846 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 52,771 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,301 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 16 పాయింట్ల లాభంతో 53,177 వద్ద ముగిసింది. కనిష్ఠ స్థాయి నుంచి దాదాపుగా 600 పాయింట్లు ర్యాలీ చేసింది.


NSE Nifty


సోమవారం 15,832 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 15,757 వద్ద ఓపెనైంది. 15,710 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,892 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 18 పాయింట్ల లాభంతో 15,850 వద్ద క్లోజైంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 33,578 వద్ద మొదలైంది. 33,503 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,745 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 168 పాయింట్ల నష్టంతో 33,642 వద్ద ముగిసింది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 32 కంపెనీలు లాభాల్లో 17 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, హిందాల్కో, కోల్‌ ఇండియా, ఎం అండ్‌ ఎం, టెక్‌ మహీంద్రా షేర్లు లాభపడ్డాయి. టైటాన్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, దివిస్‌ ల్యాబ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ నష్టపోయాయి. ఫార్మా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు స్వల్ప నష్టాల్లో ముగిశాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, మెటల్‌, ఆటో 1-2 శాతం వరకు పెరిగాయి.