Stock Market Opening 13 July 2023:


స్టాక్‌ మార్కెట్లు గురువారం రెచ్చిపోయాయి! ఈక్విటీ బుల్స్‌ రంకెలేస్తున్నాయి. మార్కెట్‌ ఓపెనింగ్‌ నుంచే మదుపర్లు కోట్లు కురిపిస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 175 పాయింట్లు పెరిగి 19,559 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 638 పాయింట్లు పెరిగి 66,032 వద్ద కొనసాగుతున్నాయి. టీసీఎస్‌, రిలయన్స్‌ షేర్లు దుమ్మురేపుతున్నాయి.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 65,393 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 65,393 వద్ద మొదలైంది. 65,605 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 66,049 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 638 పాయింట్ల లాభంతో 66,032 వద్ద కొనసాగుతోంది.



NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


బుధవారం 19,384 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 19,495 వద్ద ఓపెనైంది. 19,449 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 19,566 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 175 పాయింట్లు పెరిగి 19,559 వద్ద ట్రేడవుతోంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ లాభపడింది. ఉదయం 45,009 వద్ద మొదలైంది. 44,803 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 45,014 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 357 పాయింట్లు పెరిగి 44,996 వద్ద ట్రేడవుతోంది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 39 కంపెనీలు లాభాల్లో 11 నష్టాల్లో ఉన్నాయి. టీసీఎస్‌, హిందాల్కో, టెక్‌ మహీంద్రా, ఇన్ఫీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. పవర్‌ గ్రిడ్‌, కోల్‌ ఇండియా, అపోలో హాస్పిటల్స్‌, యూపీఎల్‌, ఎన్‌టీపీసీ షేర్లు నష్టపోయాయి. మీడియా, ఫార్మా, హెల్త్‌కేర్‌, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ మినహా అన్ని సూచీలు పెరిగాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఐటీ, మెటల్‌, రియాల్టీ సూచీలు కళకళలాడుతున్నాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.380 పెరిగి రూ.60,000గా ఉంది. కిలో వెండి రూ.2000 పెరిగి రూ.75,600 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.600 పెరిగి రూ.25,190 వద్ద ఉంది.


Also Read: ‘చాట్‌జీపీటీ’కి పోటీగా మస్క్‌ మామ కొత్త కంపెనీ, పేరు xAI


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.


Join Us on Telegram: https://t.me/abpdesamofficial