Stock Market Opening Bell 06 September 2022: భారత స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో మదుపర్లు అమ్మకాలు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 79 పాయింట్ల నష్టంతో 17,576 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 288 పాయింట్ల నష్టంతో 59,908 వద్ద కొనసాగుతున్నాయి. 


BSE Sensex


క్రితం సెషన్లో 59,196 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 58,789 నష్టాల్లో మొదలైంది. 58,722 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 59,970 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 288 పాయింట్ల నష్టంతో 58,908 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


మంగళవారం 17,655 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 17,483 వద్ద ఓపెనైంది. 17,484 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,593 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 79 పాయింట్ల నష్టంతో 17,576 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ముగిసింది. ఉదయం 39,337 వద్ద మొదలైంది. 39,258 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 39,498 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 235 పాయింట్ల నష్టంతో 39,431 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. శ్రీ సెమ్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, కోల్‌ ఇండియా, నెస్లే ఇండియా, బ్రిటానియా షేర్లు లాభాల్లో ఉన్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ మినహా మిగతా రంగాల సూచీలు నష్టపోయాయి. బ్యాంకు, ఆటో, ఐటీ, రియాల్టీ షేర్ల అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.