అన్వేషించండి

Stock Market News: స్టాక్‌ మార్కెట్లు విలవిల! సెన్సెక్స్‌ 585, నిఫ్టీ 160 డౌన్‌

Stock Market @ 12 PM on 3 June 2022: ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 160 పాయింట్ల నష్టంతో 16,407, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 585 పాయింట్ల నష్టంతో 55,092 వద్ద కొనసాగుతున్నాయి.

Stock Market @ 12 PM  on 3 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీ నష్టాల్లో ఉన్నాయి. ఆసియా మార్కెట్లు నష్టాల్లో ఉండటం, అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలు మళ్లీ పెరగడం, ద్రవ్యోల్బణం భయాలు మదుపర్లను వెంటాడుతున్నాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్షల్లో మళ్లీ వడ్డీరేట్లు పెంచుతారన్న అంచనా నడుమ సూచీలు సెల్లింగ్‌ ప్రెజర్‌కు గురవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 160 పాయింట్ల నష్టంతో 16,407, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 585 పాయింట్ల నష్టంతో 55,092 వద్ద కొనసాగుతున్నాయి. 

BSE Sensex

క్రితం సెషన్లో 55,675 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,373 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. 54,882 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,387 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 585 పాయింట్ల నష్టంతో 55,092 వద్ద కొనసాగుతోంది. ఉదయం నుంచి అమ్మకాల ఒత్తిడిలో ఉంది.

NSE Nifty

సోమవారం 16,569 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,487 వద్ద ఓపెనైంది. 16,347 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,487 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో 160 పాయింట్ల నష్టంతో 16,407 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

Nifty Bank

నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 35,080 వద్ద మొదలైంది. 34,912 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,154 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 290 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది.

Gainers and Lossers

నిఫ్టీ 50లో 10 కంపెనీలు లాభాల్లో 40 నష్టాల్లో ఉన్నాయి. ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, బీపీఎల్‌ లాభాల్లో ఉన్నాయి. టైటాన్‌, యూపీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఎల్‌టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియాల్టీ 1 శాతం వరకు పతనమయ్యాయి. ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌, పవర్‌ షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by NSE India (@nseindia)

టాప్ హెడ్ లైన్స్

Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget