Stock Market Closing 10 February 2023: 


స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం నష్టాల్లోనే ముగిశాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలే అందాయి. కేంద్ర బ్యాంకులు రెపోరేట్లు పెంచడం, యూఎస్‌ ఫెడ్‌ హాకిష్ కామెంట్స్‌ మదుపర్లలో నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 36 పాయింట్ల నష్టంతో 17,856 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 123 పాయింట్ల నష్టంతో 60,682 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి ఒక పైసా బలపడి 82.51 వద్ద స్థిరపడింది. ఉదయం టాప్‌గెయినర్స్‌గా ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ సాయంత్రానికి టాప్‌ లాసర్ల జాబితాలో చేరింది.


BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)


క్రితం సెషన్లో 60,806 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 60,706 వద్ద మొదలైంది. 60,501 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 60,774 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 123 పాయింట్ల నష్టంతో 60,682 వద్ద ముగిసింది.


NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)


గురువారం 17,893 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ శుక్రవారం 17,847 వద్ద ఓపెనైంది. 17,801 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 17,876 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 36 పాయింట్ల నష్టంతో 17,856 వద్ద క్లోజైంది.


Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)


నిఫ్టీ బ్యాంక్‌ స్వల్ప లాభాల్లో ముగిసింది. ఉదయం 41,452 వద్ద మొదలైంది. 41,424 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 41,678 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 5 పాయింట్లు పెరిగి 41,559 వద్ద స్థిరపడింది.


Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)


నిఫ్టీ 50లో 23 కంపెనీలు లాభాల్లో 27 నష్టపోయాయి. టాటా మోటార్స్‌, యూపీఎల్‌, సిప్లా, హీరోమోటో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ షేర్లు లాభపడ్డాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హిందాల్కో, టాటా స్టీల్‌, కోల్‌ ఇండియా షేర్లు నష్టపోయాయి. ఆటో, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ, కన్జూమర్‌ డ్యురబుల్స్‌ సూచీలు ఎగిశాయి. ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, మెటల్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు ఎరుపెక్కాయి.


బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)


నేడు విలువైన లోహాల ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాములు రూ.550 తగ్గి రూ.57,160గా ఉంది. కిలో వెండి రూ.550 తగ్గి రూ.71,800 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.700 తగ్గి రూ.25,180 వద్ద ఉంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.