search
×

Stock Market News: సాయంత్రం పడ్డాయి! ఫ్లాట్‌గా క్లోజైన నిఫ్టీ, సెన్సెక్స్‌!

Stock Market Closing 09 May 2023: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మధ్యాహ్నం వరకు బాగా పెరిగిన సూచీలు ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక నేల చూపులు చూశాయి.

FOLLOW US: 
Share:

Stock Market Closing 09 May 2023:  

స్టాక్‌ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్‌గా ముగిశాయి. మధ్యాహ్నం వరకు బాగా పెరిగిన సూచీలు ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక నేల చూపులు చూశాయి. ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగారు.  ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 2 పాయింట్లు పెరిగి 18,265 బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 2 పాయింట్లు తగ్గి 61,761 వద్ద ముగిశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 25 పైసలు బలహీనపడి 82.05 వద్ద స్థిరపడింది.

BSE Sensex (బీఎస్ఈ సెన్సెక్స్)

క్రితం సెషన్లో 61,764 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 61,879 వద్ద మొదలైంది. 61,654 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,027 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 2 పాయింట్ల నష్టంతో 61,761 వద్ద ముగిసింది.

NSE Nifty (ఎన్ఎస్ఈ నిఫ్టీ)

సోమవారం 18,264 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 18,303 వద్ద ఓపెనైంది. 18,229 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,344 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 2 పాయింట్లు పెరిగి 18,265 వద్ద క్లోజైంది.

Nifty Bank (బ్యాంకు నిఫ్టీ)

నిఫ్టీ బ్యాంక్‌ నష్టపోయింది. ఉదయం 43,438 వద్ద మొదలైంది. 43,125 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,533 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 85 పాయింట్లు తగ్గి 43,198 వద్ద క్లోజైంది.

Gainers and Lossers (టాప్ గెయినర్స్, టాప్ లాసర్స్)

నిఫ్టీ 50లో 25 కంపెనీలు లాభాల్లో 25 నష్టాల్లో ఉన్నాయి. దివిస్‌ ల్యాబ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, కోల్‌ ఇండియా, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంకు షేర్లు లాభపడ్డాయి. యూపీఎల్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌‌ షేర్లు నష్టపోయాయి. ఆటో, ఐటీ, ఫార్మా, ప్రైవేటు బ్యాంక్‌, హెల్త్‌కేర్‌ సూచీలు ఎగిశాయి. బ్యాంకు, ఫైనాన్స్‌, ఎఫ్‌ఎంసీజీ, పీఎస్‌యూ బ్యాంక్‌, రియాల్టీ సూచీలు ఎరుపెక్కాయి.

బంగారం, వెండి ధరలు (Gold, Silver Prices)

నేడు విలువైన లోహాల ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.61,850గా ఉంది. కిలో వెండి రూ.100 పెరిగి రూ.78,100 వద్ద కొనసాగుతోంది. ప్లాటినం 10 గ్రాముల ధర రూ.270 తగ్గి రూ.27,900 వద్ద ఉంది.

Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.

Published at : 09 May 2023 03:51 PM (IST) Tags: Stock Market Update stock market today Stock Market Telugu Share Market Stock Market news BSE Sensex

ఇవి కూడా చూడండి

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Fund: మ్యూచువల్‌ ఫండ్స్‌ రికార్డ్‌, ప్రభంజనంలా వచ్చి పడుతున్న జనం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

Mutual Funds: హైబ్రిడ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌కు మహా గిరాకీ - టాక్స్‌ సేవింగ్‌ ఆప్షనే కారణం

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

ELSS: ట్యాక్స్‌ ఆదా చేయండి, డబ్బూ సంపాదించండి - బెస్ట్‌ ELSS ఫండ్స్‌ ఇవే!

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

Market Holiday: స్టాక్‌ మార్కెట్లకు సెలవు ఇప్పించిన అయోధ్య రామయ్య

Bitcoin: బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

Bitcoin: బిట్‌కాయిన్‌కు బంపర్‌ ఆఫర్‌, క్రిప్టో ఇన్వెస్టర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ ఇచ్చిన US

టాప్ స్టోరీస్

Hindupuram Politics : కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ

Hindupuram Politics :   కూటమిలో రెబల్ అభ్యర్థిగా పరిపూర్ణానంద - టిక్కెట్ రాకుండా బాలకృష్ణ అడ్డుకున్నారని ఆరోపణ

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు

కాంగ్రెస్‌కి ఐటీ శాఖ నోటీసులు, రూ.1,700 కోట్లు చెల్లించాలని ఆదేశం - జైరాం రమేశ్ విమర్శలు

BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్

BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?

AP DSC: ఏపీలో 40 సంవత్సరాల్లో 16 డీఎస్సీలు, ఎవరి హయాంలో ఎన్ని వెలువడ్డాయంటే?