search
×

Delay In Mutual Funds Units: మీ MF యూనిట్లు ఆలస్యంగా క్రెడిట్‌ అయ్యాయని భయపడుతున్నారా?

Delay In Mutual Funds Units: మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు గత నెల్లో వారం రోజుల వరకు కేటాయించలేదు. దాంతో చాలామంది ఆందోళన చెందారు. అందుకు ఓ కారణం ఉంది.

FOLLOW US: 
Share:

Reasons To Know Why Mutual fund Units Allocated Late in Last Month : తమ ఆర్థిక లక్ష్యాలను నెరవేర్చుకొనేందుకు చాలా మంది మ్యూచువల్‌ ఫండ్లలో (Mutual Funds) పెట్టుబడి పెడుతుంటారు. ఉద్యోగులు, పేద, మధ్య తరగతి ప్రజలు ఏక మొత్తంలో ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇబ్బంది పడతారు. అందుకే క్రమానుగత పెట్టుబడి విధానాన్ని (SIP) ఎంచుకుంటారు.

సాధారణంగా కస్టమర్లు నిర్ణయించుకున్న తేదీ నుంచి రెండు రోజుల్లోపు మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు (Mutual Fund Units) ఖాతాల్లో జమ అవుతుంటాయి. గత నెల్లో మాత్రం వారం రోజుల వరకు యూనిట్ల కేటాయింపు జరగకపోవడంతో చాలామంది ఆందోళన చెందారు. అందుకు ఓ కారణం ఉంది.

మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయాలంటే మొదట మనం కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎవరో ఒక బ్రోకర్‌ లేదా ఫ్లాట్‌ఫామ్‌ను ఎంచుకుంటాం. ఉదాహరణకు పేటీఎం మనీ, అప్‌స్టాక్ట్స్‌, గ్రో మనీ వేదికల సాయం తీసుకుంటాం. మరికొందరు నేరుగా మ్యాచువల్‌ ఫండ్‌ ఏఎంసీల్లోనే ఖాతాలు తెరుస్తారు. ఆ తర్వాత సిప్‌ చేసే డబ్బును నిర్ణయించుకొని వారికి తెలియజేస్తాం. కొందరు ఆటో పే ఆప్షన్‌ ఎంచుకుంటారు.

ఇలా చేస్తున్నప్పుడు మన బ్యాంకు ఖాతాల్లోని డబ్బు మొదట బ్రోకింగ్‌ కంపెనీల ఖాతాల్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మ్యూచువల్‌ ఫండ్‌ హౌజ్‌లోకి బదిలీ అవుతుంది. దీనిని 'మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పూలింగ్‌' అంటారు. 2022 జులై 1 నుంచి ఈ పద్ధతిని సెబీ నిలిపివేసింది. అంటే ఇకపై కస్టమర్‌ బ్యాంకు ఖాతా నుంచి డబ్బు నేరుగా ఫండ్‌ హౌజ్‌కు వెళ్తుంది. ఇందు కోసం ఇన్వెస్టర్లు క్లియరింగ్‌ కార్పొరేషన్‌ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుందని తెలిసింది. పాత పద్ధతి నుంచి తప్పుకోవడంతోనే యూనిట్ల కేటాయింపు ఆలస్యమైంది.

భారీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద ఖాతాలు తెరిచిన వారికే కొన్ని ఇబ్బందులు కలగొచ్చని విశ్లేషకులు అంటున్నారు. 'ఫండ్‌ హౌజ్‌కే నేరుగా డబ్బులు పంపించాలని మాకు ఆదేశాలు అందాయి. కాబట్టి మా కస్టమర్లకు ఇబ్బందేమీ ఉండదు. ఒకవేళ మీరు పెద్ద డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ లేదా మ్యూచువల్‌ ఫండ్‌ వేదికతో డీల్‌ చేస్తుంటే వారి స్థాయిలో మార్పు ఉంటుంది. పేపర్‌ వర్క్‌ గురించి రిటైల్‌ ఇన్వెస్టర్లు ఆందోళన పడాల్సిన అవసరం లేదు'  అని ముంబయికి చెందిన లాడర్‌అప్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ స్థాపకులు రాఘవేంద్ర నాథ్‌ అంటున్నారు. ఇప్పటికే కస్టమర్ల డేటా, సిస్టమ్స్‌లో మార్పులు చేసేశామని పెద్ద కంపెనీలు చెబుతున్నాయి.

Published at : 30 Jun 2022 06:28 PM (IST) Tags: investment SIP Mutual Funds Mutual fund Units MF units

ఇవి కూడా చూడండి

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

Retirement Planning : రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం స్టెప్-అప్ SIPలు బెస్ట్... ఎక్కువ బెనిఫిట్స్ కోసం

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

SIP , PPFలో లాంగ్‌ టెర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఏది ఉత్తమం? ఎక్కడ ఎక్కువ సంపాదించవచ్చు?

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Children Day: ట్రెండ్‌ మారింది, చిల్డ్రన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల వరద

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

Money Earning Tips: ఇలా SIP చేస్తే కోటీశ్వరులు అవుతారు.. రూ.2000తో మొదలుపెట్టి ఇలా ఇన్వెస్ట్ చేయాలి

టాప్ స్టోరీస్

India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల

Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం

CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం