Stock Market Opening Bell on 31 May 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) మంగళవారం భారీ నష్టాల్లో మొదలయ్యాయి. ఆరంభం నుంచే మదుపర్లు అమ్మకాలు చేపట్టారు.  ఆసియా మార్కెట్లు నష్టాల్లో మొదలవ్వడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు లేకపోవడం నెగెటివ్‌ సెంటిమెంటుకు దారితీసింది. ఆటో, క్యాపిటల్‌ గూడ్స్‌ షేర్లకు డిమాండ్‌ పెరిగింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 16,591 వద్ద కొనసాగుతోంది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 312 పాయింట్ల నష్టాల్లో ఉంది.


BSE Sensex


క్రితం సెషన్లో 55,925  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 55,622 వద్ద భారీ నష్టాల్లో మొదలైంది. ఆరంభం నుంచే అమ్మకాల జోరు కనిపించింది. 55,386 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 55,659 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 312 పాయింట్ల నష్టంతో 55,606 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


సోమవారం 16,661 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,578 వద్ద ఓపెనైంది. ఆరంభం నుంచే నష్టాల్లో ఉంది. 16,521 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,599 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 70 పాయింట్ల నష్టంతో 16,591 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 35,615 వద్ద మొదలైంది. 35,579 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 35,753 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 93 పాయింట్ల నష్టంతో 35,733 వద్ద కొనసాగుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 27 కంపెనీలు లాభాల్లో 23 నష్టాల్లో ఉన్నాయి. ఎం అండ్‌ ఎం, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌ షేర్లు లాభాల్లో ఉన్నాయి. సన్‌ ఫార్మా, టైటాన్‌, హిందుస్థాన్‌ యనీలివర్‌, కొటక్‌ బ్యాంక్‌, టీసీఎస్‌ నష్టాల్లో ఉన్నాయి. ఆటో, మెటల్‌ సూచీలు లాభాల్లో ఉన్నాయి. మిగతావన్నీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. క్యాపిటల్‌ గూడ్స్‌, రియాల్టీ షేర్లు కొనుగోలు చేస్తున్నాయి. ఐటీ, బ్యాంక్స్‌ స్టాక్స్‌ సెల్లింగ్‌ ప్రెజర్‌లో ఉన్నాయి.