భారత్‌లో బంగారం, వెండి ధరలు ఈ రోజు (సెప్టెంబరు 6) స్వల్పంగా పెరిగాయి. బంగారం ధర గ్రాముకు రూ.10 వరకూ పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ భారత మార్కెట్‌లో రూ.45,510 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర తాజాగా రూ.48,560 గా ఉంది. మొత్తానికి గత 10 రోజుల ధరలతో పోలిస్తే పసిడి కాస్త ధర పెరిగింది.  .


భారత మార్కెట్‌లో బంగారం ధర పెరగ్గా.. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. తాజాగా భారత మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.69,600గా కొనసాగుతోంది. హైదరాబాద్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.69,600గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ముఖ్య నగరాల్లో సెప్టెంబరు 6న బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.


తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి తాజా ధరలివీ..


హైదరాబాద్‌ మార్కెట్‌లో బంగారం ధర గ్రాముకు రూ.1 పెరిగింది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం (99.99) ధర ప్రస్తుతం రూ.48,560 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం (91.6) ధర రూ.44,510 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.69,600 పలికింది.


ఇక విజయవాడలో 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర సెప్టెంబరు 6న రూ.44,510 కాగా.. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,560గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.69,600గా ఉంది. విశాఖపట్నం పసిడి మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,510 గానే ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,560గా ఉంది. ఇక్కడ కూడా వెండి ధర కిలోకు హైదరాబాద్ తరహాలోనే రూ.69,600 పలుకుతోంది.


దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధర ఇలా..


దేశంలోని వివిధ నగరాలలో బంగారం ధరలు సెప్టెంబరు 5న ఇలా ఉన్నాయి. ముంబయిలో ఈరోజు 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.46,410 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.47,410గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,970 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,060గా ఉంది.


ప్లాటినం ధరలో స్వల్ప తగ్గుదల


సంపన్నులు ఎక్కువగా ఆసక్తి చూపించే మరో విలువైన లోహం అయిన ప్లాటినం ధర హైదరాబాద్‌లో గ్రాము రూ.2,397గా ఉంది. ముందు రోజుతో పోలిస్తే ఈ ధరలో మార్పులేదు. 10 గ్రాముల ప్లాటినం ధర ఇక్కడ రూ.23,970 గా ఉండగా.. విశాఖపట్నం, విజయవాడలో కూడా 10 గ్రాముల ప్లాటినం ధర అదే కొనసాగుతోంది.


వివిధ అంశాలపై పసిడి ధర


బంగారం ధరల్లో ప్రతిరోజూ మార్పు చేసుకుంటుండడం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో పసిడి ధరలు పెరగడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయపరమైన కారణాలు ఉంటాయి. ద్రవ్యోల్బణం, సెంట్రల్ బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల, వివిధ జువెలరీ మార్కెట్లలో బంగారానికి వినియోగదారుల నుంచి ఉంటున్న డిమాండ్ వంటి ఎన్నో అంశాలు బంగారం ధరను ప్రభావితం చేస్తాయి.


Also Read: Andhra Corona Update: ఏపీలో కొత్తగా 1,623 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా మరో 8 మంది మృతి