Upcoming 7 Seater Electric SUVs India: భారత్ మార్కెట్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఈవీలు కొనేందుకు మొగ్గు చూపుతున్న ప్రయాణికులు ఇప్పుడు భారీ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఈవీ అంటేనే ఒక చిన్న ఫ్యామీలీ కారు నుంచి భారీ ఫ్యామిలీల కోసం కూడా ఈవీలను కొనాలనే ఆలోచన మారుతోంది. దీన్ని గమనించిన తయారీదారులు విలాసవంతమైన కార్లను బడ్జెట్‌లోనే తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాయి. మిడ్‌సైజ్ ఎస్‌యూవీ విభాగంలో మాదిరిగానే ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ వాహనాల విభాగంలో కూడా ఈవీల హవా పెరగబోతోంది. 

Continues below advertisement

600 కిలోమీటర్లకు పైగా రేంజ్‌, అడ్వాన్స్‌డ్‌ ఏడీఏఎస్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి ఫీచర్లతో రాబోతున్న ఈ వాహనాల గురించి, ఫీచర్స్, ధరలు ఇతర వివరాలు గురించి తెలుసుకోండి. 

టాటా సఫారీ ఈవీ 

టాటా మోటార్స్‌ ఇప్పటికే హారియర్‌ ఈవీపై కసరత్తు పూర్తి చేసి, ఇప్పుడు తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ సఫారీని ఎలక్ట్రిక్ రూపంలోకి మారుస్తోంది. సాధారణం సఫారీ డిజైన్‌నే ఇది కొనసాగించినప్పటికీ, ఎలక్ట్రిక్ వాహనానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు ఉండనున్నాయి. క్లోజ్డ్‌ ఫ్రంట్‌ గ్రిల్‌, గాలిని చీల్చుకుంటూ వెళ్లే ఏరోడైనమిక్‌ వీల్స్‌, కొత్తగా డిజైన్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్‌ ల్యాంప్స్‌ దీనికి కొత్త రూపాన్ని ఇస్తాయి. 

Continues below advertisement

Also Read: అనుకూల బడ్జెట్‌, ఆకట్టుకునే మైలేజ్‌! భారత మార్కెట్‌లో దుమ్మురేపుతున్న టాప్‌ 125 సీసీ స్కూటర్లు ఇవే!

ఇందులో రెండు రకాల బ్యాటరీ ప్యాక్‌ ఆప్షన్లు ఉండే అవకాశం ఉంది. 65kWhబ్యాటరీతో సుమారు 538 కిలోమీటర్ల రేంజ్, 75kWh బ్యాటరీతో కంగా 622 నుంచి 627 కిలోమీటర్ల వరకు రేంజ్‌ లభించవచ్చని అంచనా  ఉంది. ఎక్కువ వేరియంట్లలో ఆల్‌ వీల్ డ్రైవ్‌ సదుపాయం కూడా ఉంటుంది. ఇది ఆఫ్‌ రోడింగ్ ప్రియులను ఆకట్టుకోనుంది. దసరా నాటికి ఇది మార్కెట్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. 

Also Read: హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా vs విడా VX2గో: లక్ష లోపు బడ్జెట్‌లో బెస్ట్ ఈవీ ఏది? ధర ఫీచర్లు, పెర్ఫార్మెన్స్‌ గురించి తెలుసుకోండి!

మారుతి సుజుకి YMC

దేశంలోనే నవంబర్ వన్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తన మొట్టమొదటి  సీటర్ ఎలక్ట్రిక్ ఎంపీవీని సిద్ధం చేస్తోంది. దీనికి అంతర్గత YMC అనే కోడ్ పేరు పెట్టారు. ఇటీవల మార్కెట్‌లోకి వచ్చిన ఇ విటారా ప్లాట్‌ఫామ్‌పైనే ఈ ఎంపీవీ రూపొందుతోంది. ఇది 2026 చివరి నాటికి విడుదలయ్యే ఛాన్స్ ఉంది. ఇందులో పెద్ద టచ్‌స్క్రీన్, విశాలమైన క్యాబిన్, మధ్య వరుసలో కెప్టెన్‌సీట్లు, 360 డిగ్రీ కెమెరా, లెవల్‌ 2 అడాస్‌ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉంటాయి. వైర్‌లెస్‌ ఛార్జింగ్‌, వెంటిలేటెడ్‌ సీట్లు, పనోరమిక్ గ్లాస్‌ రూఫ్‌ దీనికి అదనపు ఆకర్షణ. 

Also Read: కొత్త SUV కొనడం కంటే, ఈ 5 పాత సెడాన్‌లు తీసుకోవడం బెటర్.. అందుకు కారణాలివే

టాటా మోటార్స్ అవీన్యా ఎక్స్‌

టాటా తన ప్రీమియం ఈవీ నెట్‌వర్క్‌ కింద అవిన్యూ ఎక్స్‌ను తీసుకురాబోతోంది. గతంలో ఆటో ఎక్స్‌పోలో కాన్సెప్ట్‌ రూపంలో చూపించిన ఈ వాహనం, ఇప్పుడు ప్రొడక్షన్ దశకు చేరుకుంటోంది. ఇది 5,6, 7 సీట్‌ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులోకి రానుంది. సుమారు ఐదు మీటర్ల పొడవు ఉండే ఈ క్రాస్ ఓవర్‌, టాటా ప్రస్తుత కార్ల కంటే ఎంత ఆడ్వాన్స్‌డ్‌ ఫీచర్లతో వస్తోంది. 

Also Read: టీవీఎస్ జూపిటర్ 125 నుంచి అదిరిపోయే అప్‌డేట్‌! ఆకట్టుకునే ఫీచర్స్‌తోపాటు కలర్‌ఫుల్ రంగుల్లో మార్కెట్‌లోకి...

విన్‌ఫాస్ట్ వీఎఫ్‌ ఎంపీవీ 7

వియత్నాంకు చెందిన ఈవీ కంపెనీ విన్‌ఫాస్ట్‌ కూడా భారత మార్కెట్‌లోకి అడుగు పెడుతోంది. తన మొదటి 7 సీటర్‌ ఎంపీవీగా వీఎఫ్‌ ఎంపీవీ 7ను ప్రవేశపెట్టనుంది. ఇందులో 60.13kWh బ్యాటరీ ప్యాక్ ఉండే అవకాశం ఉంది. ఇది సుమారు 517 కిలోమీటర్ల రేంజ్‌ను ఇవ్వగలదు. పరిమిత రంగుల్లో వచ్చినా, రైడ్‌ హైలింగ్ సర్వీస్‌ల కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. 

Also Read: టాటా టియాగో సీఎన్‌జీలో సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ - ప్యాడల్ షిఫ్టర్లతో రాబోతున్న సరికొత్త 2026 ఫేస్‌లిఫ్ట్ మోడల్

చాలా మంది పర్యటనకు వెళ్లేటప్పుడు ఎక్కువ మంది ఒకే కారులో వెళ్లాలని కోరుకుంటారు. పెట్రోల్ ధరలు పెరుగుతున్న వేళ వినియోగదారుల ఆలోచన సరళి కూడా మారుతోంది. అందుకే 7 సీటర్ ఈవీలు తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ప్రయాణించడానికి వీలుగా ఉంటున్నాయి. ఇప్పుడు వస్తున్న కొత్త తరం ఈవీలు కేవలం ఇంజిన్ మార్పుతోనే కాకుండా రేంజ్‌ కూడా పెరుగుతోంది. ఇప్పుడు వస్తున్న వాటిలో 600 కిలోమీటర్ల రేంజ్ కలిగిన వాహనాలు ఉన్నాయి. అంతే కాకుండా లేటెస్ట్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో కూడా తగ్గేదేలే అన్నట్టు ప్రత్యర్థులతో పోటీ పడుతున్నాయి. 

భవిష్యత్ అంతా ఎలక్ట్రిక్ వాహనాలదే అనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పెద్ద కుటుంబాల కోసం వస్తున్న ఈ 7 సీటర్ ఎస్‌యూవీలు భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని మరో మెట్టుపైకి తీసుకెళ్లబోతున్నాయి.