Visakha News: విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో సంగీత దర్శకుడు ఎస్.ఎస్. తమన్ సందడి చేశారు. ఏయూ ఆడియో ఇంజనీరింగ్, మ్యూజిక్ ప్రొడక్షన్ డిపార్ట్ మెంట్ ను ప్రారంభించారు. అయితే ఆంధ్రా విశ్వ విద్యాలయం సౌండ్ అండ్ రికార్డింగ్  ప్రీ ప్రొడక్షన్ లో సర్టిఫికెట్ కోర్సులను ప్రారంభించింది. ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ను యూనివర్సిటీకి ఆహ్వానించింది. ఈ సందర్భంగానే తమన్ మాట్లాడుతూ... తమ కుటుంబానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతాలతో చాలా సంబంధం ఉందని తెలిపారు. ఆంధ్ర లో పెద్ద కవులు ఉన్నారని గుర్తు చేశారు. చాలా మంది సంగీత దర్శకులు కూడా ఈ రాష్ట్రం నుంచి వచ్చిన వారేనని వివరించారు. ఏయూ ఈ తరహా కోర్సు పెట్టడం సంతోషంగా ఉందని చెప్పారు. తన రిటైర్ లైఫ్ కూడా వైజాగ్ లో ఉండాలని ఉందని తన మనసులోని కోరికని బయటపెట్టారు. ఆంధ్రలో సొంతంగా ఒక స్టూడియో పెట్టాలనే ఆలోచనతో ఉన్నట్లు వివరించారు. మనస్సుకు భాద కలిగితే సంగీతంతోనే పోతుందని... అలాగే సంగీత కళాకారులకు సంగీతంలోనే ఒత్తిడి పోతుందని అన్నారు.