ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌లో ఇవాళ ఎంవోయూలు జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. పదిన్నరకు ప్రముఖ ఇండో అమెరికన్ మ్యుజీషియన్ కర్ష్‌కాలే బ్యాండ్‌ ప్రదర్శన ఉంటుంది. అనంతరం ఏపీ సీఎస్‌ జవహార్‌ రెడ్డి ప్రసంగిస్తారు. అనంతరం రాష్ట్రంలో ఉన్న వనరుల గురించి పరిశ్రమల మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి స్పీచ్ ఉంటుంది. ఆ తర్వాత నోవా ఎయిర్‌ సీఈవో అండ్‌ ఎండీ గజాసన్‌ నాబర్‌, అవాడ గ్రూప్‌ ఛైర్మన్‌ వినీత్‌ మిట్టల్, లారస్ ల్యాబ్స్‌ ఫౌండర్‌ అండ్ సీఈవో సత్యనారాయణ చావ, హెటిరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఎండీ డాక్టర్‌ వంశీ కృష్ణ బండి, గ్రీన్‌కో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ ఎండీ అనీల్‌ కుమార్‌ చలమశెట్టి, సెయింట్‌ గోబిన్ ఆసియా-పసిఫిక్ అండ్‌ ఇండియా సీఈవో సంతానం మాట్లాడనున్నారు. 


రాష్ట్రవైద్యఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీ, అపాజీ అండ్‌ హిల్‌టాప్ గ్రూప్‌ డైరెక్ట్ అండ్‌ గ్రూప్‌ హెడ్‌ ఇండియా ఆపరేషన్స్‌ సర్జియో లీ, బ్లెండ్‌ హబ్ ఫౌండర్ హెన్‌రిక్‌ స్టామ్‌ క్రిస్టెన్‌ సన్‌, వెల్‌స్పన్ గ్రూప్ ఎండీ రాజేష్‌ మండవేవాలా, వెల్‌స్పన్‌ గ్రూప్‌ ఎండీ సతీష్‌ రెడ్డి, భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ ఎండీ, ససీఐఐ సదరన్‌ రీజియన్ చైర్‌పర్శన్ సుచిత్ర కె. ఎల్లా  ప్రసంగిస్తారు. 


ఇవాళ్టి సభలో కేంద్ర  పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పాల్గొంటారు. ఆయన కూడా ప్రసగించనున్నారు. ఆయనతోపాటు కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద్‌ సోనావాల్ కూడా సమ్మిట్‌కు హాజరై ప్రసగిస్తారు.  సాయంత్రానికి సీఎం జగన్ ముగింపు ఉపన్యాసం చేస్తారు. 
ఈ ప్రసంగాలతోపాటు ఉదయం 9 గంటల నుంచి వివిధ అంశాలపై చర్చలు ఉంటాయి. ఇవాళ 8 అంశాలపై సెషన్లు ఉంటాయి. ఉదయం 9గంటలకు ఆడిటోరియం 1లో పెట్రోడెవలప్‌మెంట్‌ అండ్ పెట్రో కెమికల్స్‌పై చర్చ ఉంటుంది. ఆడిటోరియం రెండులో హయ్యర్‌ ఎడ్యుకేషన్, మూడులో స్కిల్‌ డెవలప్‌మెంట్‌, నాలుగులో వియత్నాం  కంట్రీ సెషన్‌ ఉంటుంది. పది గంటలకు ఆడిటోరియం 1లో టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ, రెండులో టెక్స్‌టైల్స్‌ అండ్‌ అపరెల్స్‌ మూడులో ఫార్మాస్యూటికల్స్ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌, నాలుగులో వెస్టర్న్ ఆస్ట్రేలియా కంట్రీ సెషన్ నిర్వహిస్తారు. 


మొదటి రోజు తొమ్మిది అంశాలపై సెమినార్లు జరిగాయి. రెన్యువబుల్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్, ఆరోగ్య భద్రత వైద్య పరికారాలు, ఏరోస్పేస్‌ అండ్‌ ఢిఫెన్స్‌, ఐటీ, ఆటోమేటివ్‌ ఎలక్ట్రిక్‌ మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్‌, ఇండస్ట్రీయల్ అండ్ లాజిస్టిక్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్టార్టప్‌ ఇన్నోవేషన్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫుడ్‌ ప్రోసెసింగ్‌ రంగాల్లో సెషన్లు జరిగాయి. ఈ సెషన్లలో పాల్గొన్న అధికారులు రాష్ట్రంలో ఉన్న వనరులు, అనుకూల అంశాలను వచ్చిన గెస్ట్‌లకు వివరించారు. 


విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌ మొదటి రోజు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. ఈ సదస్సులో ఆయన మాట్లాడుతూ... 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ సాగిస్తున్న పయనంలో ఏపీ కీలకమని  కేంద్ర నితిన్ గడ్కరీ తెలిపారు. 975 కిలోమీటర్ల పొడవైన సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న ఆంధ్రప్రదేశ్, భారత గ్రోత్ స్టోరీలో భాగస్వామ్యం అవుతుందన్నారు. తీరం వెంబడి ఆరు పోర్టులు కలిగి, మరో నాలుగు నిర్మాణంలో ఉన్న ఏపీ... దేశ లాజిస్టిక్ రంగంలో కీలక భాగస్వామ్యం కలిగి ఉందన్నారు. రాష్ట్రంలోని పోర్టులన్నింటినీ నాలుగు లేన్ల జాతీయ రహదారులతో అనుసంధానం చేయనున్నట్లు గడ్కరీ తెలిపారు. దేశ అభివృద్ధి పథంలో ఆంధ్రప్రదేశ్ కీలకమని   రాష్ట్రంలోని పోర్టులన్నింటినీ నాలుగు లేన్ల జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రం నుంచి వెళ్లేలా 5 గ్రీన్ ఫీల్డ్ జాతీయ  రహదారులను నిర్మిస్తున్నామని, దీనికోసం రూ.30 వేల కోట్లు ఖర్చు చేయనున్నామని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టి పెట్టామని అందులో భాగంగానే ఈ తొమ్మిదేళ్లలో 4200 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులను 8700 కిలోమీటర్లకు పెంచామని చెప్పారు.