నేడు ప్రధానితో సీఎం భేటీ 


ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి నేడు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. రెండురోజుల పర్యటన కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్ ఈ మధ్యాహ్నం ప్రధాని మోదీతో భేటీ కానున్నారు . 


నెల్లూరు లో మూడురోజుల పర్యటనకు చంద్రబాబు 


టీడీపీ అధినేత చంద్రబాబు మూడు రోజుల పర్యటన కోసం చంద్రబాబు నెల్లూరు వెళ్లనున్నారు. ఈ రోజు సింగరాయ కొండ , కందుకూరులో రోడ్ షో ,పబ్లిక్ మీటింగ్‌ల్లో ఆయన పాల్గొననున్నారు. ఈ నెల 31వరకూ ఆయన నెల్లూరు పర్యటనలోనే గడపనున్నారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పలువురు కీలకనేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చెయ్యనున్నారు . 


తిరుమల చేరుకున్న సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ 


మంగళవారం నాడు ఏపీ చేరుకొన్న సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ ధనుంజయ వై.చంద్రచూడ్ ఈరోజు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు ఈరోజు రేపు ఆయన తిరుమలలోనే బసచేయనున్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు . 


తిరుమల భక్తులకు మాస్క్ తప్పనిసరి : టీటీడీ చైర్మన్ 


కోవిడ్ వ్యాప్తి మళ్ళీ కనిపిస్తున్న నేపథ్యంలో తిరుమల భక్తులకు మాస్క్ తప్పనిసరి చేశారు టీటీడీ అధికారులు. ఈ మేరకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఒక ప్రకటన జారీ చేసారు . 


జనవరి 3 నుంచి పింఛన్‌ వారోత్సవాలు 


వృద్దులకు ,వితంతువులకు ,దివ్యంగులు సహా ఇతరులకు ప్రభుత్వం ఇస్తున్న సామాజిక పెన్షన్ లను 2500 నుంచి 2750కు పెంచుతున్న నేపథ్యంలో జనవరి 3 నుంచి వారోత్సవాలు చేయబోతుంది ఏపీ ప్రభుత్వం . సీఎం జగన్ స్వయంగా వీటిని జనవరి 3న రాజమండ్రిలో ప్రారంభించనున్నారు . 


SI దరఖాస్తుల గడువు 18 వరకూ పొడిగింపు 


411 SI పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన పోలీస్ శాఖ అభ్యర్థుల నుంచి దరఖాస్తులకు గడువుతేదీని జనవరి 18 వరకూ పొడిగించింది. ముందుగా జనవరి 1 వరకే గడువు అని చెప్పినా ప్రస్తుతం ఆ గడువును పొడిగిస్తున్నట్టు ఒక ప్రకటన జారీ చేసింది . 


రాజమండ్రి,విశాఖ పర్యటనకు సోము వీర్రాజు 


ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు నేడు రాజమండ్రిలో పర్యటించనున్నారు . ఎయిర్‌పోర్టులో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్న ఆయన అనంతరం విశాఖ బయలుదేరి వెళతారు . 


నారా లోకేష్ పాదయాత్ర అధికార ప్రకటన నేడే 


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర తేదీలను టీడీపీ నేడు అధికారికంగా ప్రకటించనుంది . జనవరిలో సంక్రాంతి తరువాత లోకేష్ తన పాదయాత్ర  ప్రారంభించనున్నారు.