Top Five Headlines In AP And Telangana:


1. మహిళలకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్


రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం (AP Government) గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగినులకు అవసరమైన ప్రతి చోటా వసతి గృహాలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. సచివాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) శుక్రవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల హామీల అమల్లో భాగంగా ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్ స్థాయిలో 100 వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు సీఎంకు వివరించగా.. ఉద్యోగినుల సంఖ్యకు అనుగుణంగా అవసరమైతే డివిజన్ స్థాయిలోనూ ఏర్పాటు చేయాలని సూచించారు. ఇంకా చదవండి.


2. టీడీపీ కార్యకర్తలకు సీఎం చంద్రబాబు భరోసా


తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి ఎన్ని వినతులు వచ్చినా.. వాటన్నింటినీ  పరిష్కారమే లక్ష్యంగా పెట్టుకున్నానని టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబునాయుడు తెలిపారు. పార్టీ కార్యాయంలో ఆయన మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.  గత 5ఏళ్ల కాలంలో జరిగిన రెవెన్యూ సంబంధిత సమస్యలపైనే ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయని..  రెవెన్యూ సమస్యలకు కారణమై, అక్రమాలకు పాల్పడిన అధికారులు పై చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.  ప్రతీ మండలంలోనూ ఓ భూ కుంభకోణం వెలుగు చూస్తోందని..  రికార్డులు కూడా తారుమారు చేశారన్నారు. ఇంకా చదవండి.


3. టీడీపీ నేత బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు


సంచలనాలకు కేరాఫ్‌గా ఉండే టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన కామెంట్స చేశారు. ఎంపీ కేశినేని నాని జన్మదిన వేడుకలు తన ఆఫీస్‌లో నిర్వహించిన ఆయన... తనకు అండగా ఉంటాలంటూ విజయవాడ ఎంపీకి రిక్వస్ట్ చేశారు. తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని గట్టిగా ఎదుర్కొన్న వారిలో తాను ముందు వరసలో ఉంటానని చెప్పుకొచ్చారు బుద్దావెంకన్న. ఇంకా చదవండి.


4. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్


తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణానికి సంబంధించి మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ మేరకు ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) శనివారం కీలక ప్రకటన చేశారు. పథకంలో భాగంగా ఈ నెలాఖరులోపు మొదటి విడత కింద రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెల్లడించారు. ఇంకా చదవండి.


5. తెలంగాణలో ఐఏఎస్‌ల బదిలీలు


తెలంగాణలో మరోసారి ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఎనిమిది మందిని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వికాస్ రాజ్‌కు ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయన్ని రవాణా, హౌసింగ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్  ప్రత్యేక కార్యదర్శిగా నియమించింది. స్మార్ట్ గవర్నెన్స్‌తోపాటు కేంద్రంతో కోఆర్డినేషన్ బాధ్యత ఇచ్చారు. కమర్షియల్ ట్యాక్స్ శాఖ కమీషనర్‌గా ఉన్న శ్రీదేవిని షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌ డెవలప్‌మెంట్‌ కమిషనర్‌గా బదిలీ చేసింది ప్రభుత్వం. సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వీకి వాణిజ్య శాఖకు సంబంధించి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇంకా చదవండి.