AP Latest News: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చాలా బాధ్యతగా వ్యవహరించారు. తాను ఒక విమానంలో వెళ్తుండగా.. సాటి ప్రయాణికుడిని రక్షించారు. తాను సీఎం భార్య కావడంతో వెంటనే తనకు ఉన్న పరిధి మేరకు స్పందించి సదరు ప్రయాణికుడికి సకాలంలో చికిత్స అందించేలా చేయగలిగారు. 


హైదరాబాద్​ నుంచి తిరుపతికి వెళ్తున్న ఓ విమానంలో ఈ ఘటన జరిగింది. ఆ విమానంలో నారా భువనేశ్వరి కూడా ఉన్నారు. ఆయన శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ విమానంలో అస్వస్థతకు గురయ్యాడు. ఈ విషయాన్ని అదే విమానంలో ఉన్న భువనేశ్వరి గమనించారు. వెంటనే ఆమె చొరవ తీసుకొని ఏపీ సీఎంవోకు సమాచారం అందించారు. సీఎంవో అధికారులు కూడా తక్షణం స్పందించడంతో ఎయిర్ పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. విమానాశ్రయం వద్దకే, ఫ్లైట్ ఆగే చోటు వద్ద డాక్టర్లు, అంబులెన్స్ ​ను రెడీగా ఉంచారు. డాక్టర్లు సకాలంలో చికిత్స అందించడంతో శశిధర్ అనే ప్రయాణికుడు​ కోలుకున్నాడు.