చిత్తూరు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో మెటర్నటీ వార్డులో మగ శిశువు అదృశ్యం కావడం కలకలం రేపింది. శనివారం ఉదయం వేకువజామున మగ శిశువు అదృశ్యమైనట్లు తల్లి గుర్తించింది.


చిత్తూరు నగరం సంతపేటలోని మంగ సముద్రానికి చెందిన రహమత్ భార్య షబానా రెండవ కాన్పు కోసం ఆస్పత్రిలో చేరింది. మగ సంతానం కావడంతో ఆ తల్లిదండ్రులకు ఆనందానికి అవధులు లేవు. ఈరోజు ఉదయం మూడు గంటల సమయంలో సభాన తన మగ శిశువుకు పాలిచ్చే నిద్రపోయింది. 


ఉదయం లేచి చూసే సరికి బిడ్డ కనిపించకపోవడంతో తల్లడిల్లి పోయింది. చిత్తూరు టు టౌన్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. సీఐ యుగంధర్ సంఘటన స్థలానికి చేరుకొని సీసీ పుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.