Amaravati News :   రాజధాని అమరావతిలో R -5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు   ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఏపీ ప్రభుత్వం (  సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు న్యాయస్థానం డైరీ నంబర్ కేటాయించింది. మరో వారంలో విచారణకు వచ్చే అవకాశం ంది.  రాజధానిలోని 9 గ్రామాల రైతులు కేవియట్ పిటిషన్‌ను ( కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.  ఉత్త  తమ వాదనలు కూడా వినాలని రాజధాని రైతులు పిటిషన్‌లో పేర్కొన్నారు.


సీఆర్డీఏ  చట్టాన్ని ఉల్లంఘించి ఆర్ 5 జోన్                              


ఆర్ 5 జోన్ చట్ట విరుద్ధమంటూ  రాజధాని ప్రాంత రైతు సంక్షేమ సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ సంఘాలు వేసిన పిటిషన్ విచారించిన త్రిసభ్య ధర్మాసనం.. ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది. ప్రభుత్వం ఇక్కడ వివిధ వర్గాలకు ఇళ్లు కట్టించేందుకు 1402 ఎకరాలు కేటాయించింది. ఇందులో గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన వారిని లబ్ధిదారులుగా చేసింది. దీనిపైనే అమరావతి రైతులు పోరాటం చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ మార్చడం చట్ట విరుద్ధమని వారు వాదిస్తున్నారు. 


హైకోర్టు తీర్పులో కీలక అంశాలు                        


హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పులో కీలక అంశాలు ఉన్నాయి.  అమరావతి ఆర్‌5 జోన్‌లో చేపట్టే ఇళ్ల నిర్మాణాలను  వెంటనే నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం పేదలకు ఇస్తున్న పట్టాలు అంతిమ తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ధర్మాసనం గుర్తు చేసింది.  స్థలం ఇవ్వడానికి మాత్రమే అనుమతి గానీ కట్టడానికి కాదనిస్ష్టం చేసింది.  అదే సమయంలో  ప్రభుత్వం తామే నిర్ణయించిన భూమి విలువ రూ.   345 కోట్లు  CRDA కు చెల్లించలేదని హైకోర్టు ధర్మాసనం మరో కారణంగా తెలిపింది. మూడో కారణంగా మొత్తం ఖర్చు 1500 - 2000 కోట్లు ...స్థలాలు/ ఇల్లు...తీర్పు వ్యతిరేకంగా వస్తే ఎవరు దీనికి భాధ్యత ? వహిస్తారని  ప్రశ్నించింది.  ప్రజల సొమ్ము దుర్వినియోగం చేస్తుంటే కోర్టు చూస్తూ ఊరుకోదని స్పష్టం చేసింది.  


సుప్రీం కోర్టు తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రజా ధనం వృధా                                        


అమరావతి తీర్పు లో కూడా ఆప్పటి వరకు  చేసిన ఖర్చు వృధా అవుతుందని కోర్టు చెప్పిందని ధర్మాసనం తెలిపింది.  CRDA నిబంధనల ప్రకారం భూమి కోల్పోయిన వారికి హౌసింగ్ కోసం 5 శాతం భూమి కేటాయించారని... కానీ బయట వారికి స్థలాలు ఇస్తామని తెచ్చిన సవరణలు చర్చనీయాంశంగా ఉన్నాయన్నారు.  ఈ పరిస్థితులలో ఇళ్ళ నిర్మాణం అనుమతించ లేమని ధర్మానసం స్పష్టం చేసింది.  సుప్రీం లో కేసులు తేలిన తరువాత మాత్రమే నిర్మాణాలు చేపట్టాలని  తీర్పు చెప్పింది. 


హైకోర్టు తీర్పును ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడంతో  అక్కడ వచ్చే తీర్పును బట్టి అమరావతిలో ఇళ్ల స్థలాల నిర్ణయం ఆధారపడి ఉంటుంది. డిసెంబర్‌లో రాజధాని కేసుల విచారణ సుప్రీంకోర్టులో జరగనుంది.