తెలుగుదేశం పార్టీపై పెడన పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. టీడీపీ అంటే తెలుగు తాలిబన్ పార్టీ అని, తాలిబన్ పార్టీకి చంద్రబాబు అధ్యక్షుడిగా ఉన్నారని ఆరోపించారు. టీడీపీ అధినేత చంద్రబాబు గతంలో కులాల గురించి చేసిన పేర్కొన్న అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించారు. దళితుల్లో పుట్టాలని ఎవరు అనుకుంటారని గతంలో చంద్రబాబు అన్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన బాబుపై కేసు పెట్టాలా? లేక ఉరి తీయాలా? అని ప్రశ్నించారు. 'విశ్వ బ్రాహ్మణుల తోకలు కట్ చేస్తా.. అగ్నికుల క్షత్రియులను తరిమికొడతా' అని కూడా చంద్రబాబు అనలేదా? అని నిలదీశారు. రాష్ట్రంలో ఎస్సీ, బీసీ, మైనార్టీలు కలిసి కుటుంబంలా ఉన్నారని.. కులాల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. 


అంబేడ్కర్‌ను దేవుడిలా..
బలహీన వర్గాల వారు అంబేడ్కర్‌ను దేవుడిలా పూజిస్తున్నారని జోగి రమేష్ పేర్కొన్నారు. ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా అన్‌రిజర్వ్‌డ్ స్థానాల్లో 75 కార్పొరేషన్లల్లో అధిక శాతం బలహీన వర్గాలకు ఇచ్చారని తెలిపారు. బలహీన వర్గాలను జగన్ బలమైన వర్గంగా మారుస్తున్నారని అన్నారు. బలహీన వర్గాలు అంబేడ్కర్‌ను దేవుడిలా పూజిస్తాయని.. జగన్‌కు జేజేలు పలుకుతాయని అన్నారు. తాను అంబేడ్కర్‌ గురించి, సీఎం జగన్ గురించి మాట్లాడిన మాటలను టీడీపీ నేతలు వక్రీకరించారని విమర్శించారు. విచ్చిన్న ఆలోచలతో విషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలను చూసి టీడీపీ జీర్ణించుకోలేకపోతోందని విమర్శించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నా కోర్టులకు వెళుతున్నారని జోగి రమేష్ దుయ్యబట్టారు. 


Also Read: JNTUK News: జేఎన్టీయూకే గెస్ట్‌హౌస్‌లో శోభనం.. పూలపాన్పు, హడావుడి.. వైరల్‌గా మారిన వీడియోలు


Also Read: Raghurama Vs YSRCP : వివేకా కేసులో సీబీఐ రూ. ఐదు లక్షలిస్తే సీఎం జగన్ రూ. కోటి ఇవ్వాలని రఘురామ సూచన..!


Also Read: AP Telangana Today Updates: దళిత బంధుకు కరోనా అడ్డొచ్చిందా..? జీహెచ్ఎంసీ ఎన్నికలకు రాలేదా?: ధర్మపురి అర్వింద్


Also Read: Guntur Minor Girl Rape: దళిత బాలిక రేప్ కేసులో కొత్త కోణం... అఘాయిత్యానికి పాల్పడింది మావయ్యే.. ఆడుకోవడానికి పిలిచి అత్యాచారం