Andhra News :  నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఇష్యూతో ఒక్కసారిగా ఏపీ, తెలంగాణల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. బుధవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ పోలీసులు, ఏపీ పోలీసుల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా ఏపీ అధికారులు సాగర్ ప్రాజెక్ట్ కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధం కావడం కలకలం రేపింది. అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో ఏపీ బోర్డర్ దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. నాగార్జున సాగర్, మాచర్ల దారిలో తెలంగాణ నుంచి ఏపీ వైపు వచ్చే వాహనాలను పోలీసులు అనుమతించడం లేదు. ఏపీ అడ్రస్ ఆధార్ కార్డు కలిగి ఉన్న వారిని మాత్రమే పోలీసులు అనుమతిస్తున్నారు. మిగిలిన వారిని ఏపీ పోలీసులు వెనక్కి పంపిస్తున్నారు.                


తెలంగాణ ఎన్నికల వేళ నాగార్జున సాగర్ వద్ద బుధవారం రాత్రి హై టెన్షన్ చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఏపీకి చెందిన 500 మంది పోలీసులు అక్కడికి చేరుకుని ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 26 గేట్లలో సగభాగం అంటే 13వ గేటు వరకు తమ పరిధిలోకి వస్తుందని ఏపీ పోలీసులు ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. వెంటనే టీఎస్పీఎఫ్ సిబ్బంది ఏపీ పోలీసులు అడ్డుకోగా స్వల ఘర్షణ చోటు చేసుకుంది. ఈ అంశంపై స్పందించిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పోలింగ్‌కు ముందు రోజు కావాలనే సెంటిమెంట్‌ను రగిల్చేందుకే వ్యుహాత్మకంగా వివాదం సృష్టించారని బీఆర్ఎస్‌పై ఫైర్ అయ్యారు.                 


 ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు గురువారం ఇదే అంశంపై ఓ ట్వీట్ చేశారు. ‘తాగు నీటి అవసరాల కోసం నాగార్జున సాగర్ రైట్ కెనాల్‌కి నేడు నీరు విడుదల చేయనున్నాము!’ అంటూ సంచలన కామెంట్ పెట్టారు. అయితే ఇరు రాష్ట్రాల మధ్య వివాదాన్ని మరింత పెంచేలా అంబటి చేసిన ట్వీట్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ఉన్నందున కావాలనే కేసీఆర్ కు లబ్ధి చేకూరేలా ఇలా వైసీపీ ప్లాన్ చేసిందని మండిపడుతున్నారు.                     


ఈ ఘటనపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. పోలింగ్‌కు ముందురోజు సెంటిమెంట్‌ను రగిల్చేలా వ్యూహాత్మకంగానే వివాదం సృష్టించారని మండిపడ్డారు. ఎవరు? ఎందుకు? ఏం ఆశించి? ఈ ప్రయత్నాలు చేశారో ప్రజలకు తెలుసుని అన్నారు. సాగర్ డ్యామ్ అక్కడే ఉంటుంది. నీళ్లు ఎక్కడికి పోవు. దీనిపై పోలింగ్‌కు ముందు రోజు అర్ధరాత్రి వివాదం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఇది కచ్చితంగా కుట్రలో భాగమే అని తెలిపారు.