ఆంధ్రప్రదేశ్‌లో క్రిభ్‌కో భారీ పెట్టుబడులు పెట్టనుంది. సీఎం జగన్‌ ( CM Jagan ) అధ్యక్షతన జరిగిన క్యాంప్ కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్టిమెంట్‌ ప్రమోషన్‌ బోర్డు సమావేశం సమావేశం జరిగింది. పలు పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.  నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో కృషక్‌ భారతి కో–ఆపరేటివ్‌ లిమిటెడ్‌ ( క్రిబ్కో ) ఆధ్వర్యంలో రెండు విడతల్లో బయో ఇథనాల్‌ ప్లాంట్‌ పెట్టనుంది ఇందు కోసం  రూ.560 కోట్లు పెట్టుబడిగా పెట్టనుంది. 250 కె.ఎల్‌.డి. సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటు చేస్తారు. 100 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ వల్ల  400 మందికి ఉద్యోగాలు లభిస్తాయి.   ఇది కాకుండా మరిన్ని విత్తనశుద్ధి సహా వివిధ ప్రాససింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసే దిశగా అడుగులేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి క్రిబ్‌కో తెలిపింది.


వాలంటీర్ చేసిన పనికి గ్రామస్థులు షాక్! యూట్యూబ్ వీడియోలు చూస్తూ ఏం చేశాడో తెలుసా? పోలీసుల ఆకస్మిక దాడి


 ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీ 2022–27లో ( APIPB )  మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఇప్పుడున్న ఎగుమతులను 5 ఏళ్లలో రెట్టింపు చేసే దిశగా అడుగుు వేయాలని ..  ఐదేళ్ల కాలంలో రూ.3.5 లక్షల కోట్లు ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.  దీంట్లో భాగంగా పలు నిర్ణయాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.  ఆంధ్రప్రదేశ్‌ లాజిస్టిక్స్‌ పాలసీ 2022–2027లో భాగంగా మరిన్ని ప్రోత్సాహకాలకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.   


మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యల దుమారం! కేంద్రం జోక్యం, సీఎం రాజీనామాకు టీడీపీ డిమాండ్


రాష్ట్రం నుంచి అధికంగా ఆక్వా రంగం ( Aqua ) నుంచి ఎగుమతులు ఉన్నాయని సీఎం జగన్ ఈ సందర్భంగా తెలిపారు.  ఆక్వా ఉత్పత్తుల క్వాలిటీ పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  రైతు భరోసా కేంద్రాల  ద్వారా ఆక్వా ఉత్పత్తుల నాణ్యత పెంచడానికి చర్యలు తీసుకోవాలని ..దేశంలో మెరైన్‌ ఎగుమతుల్లో 46శాతం రాష్ట్రం నుంచే ఉన్నాయన్నారు.  అందుకనే ఈ రంగాన్ని తగిన విధంగా ప్రోత్సహించాలన్నారు.  సింగిల్‌ డెస్క్‌ పద్ధతిలో పరిశ్రమలకు అనుమతుల విధానంపై నిరంతర పర్యవేక్షణ ఉండాలన్నారు. అత్యంత పారదర్శక విధానంలో భాగంగా ఈ మార్పులను తీసుకు వచ్చామన్నారు.  విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుకు అనుమతుల ుఇచ్చామని త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. 


నేను పులివెందులకు నీళ్లిచ్చా, జగన్ కుప్పంకు నీళ్లు ఆపాడు: టీడీపీ అధినేత చంద్రబాబు