రెండు రోజులుగా జరిగిన పరిణామాలు చూస్తున్నాం. హెలికాఫ్టర్ దిగేందుకు అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్ ఇచ్చిన వాళ్లను బెదిరించి లేఖ వెనక్కి తీసుకున్నారు. చివరకు కోర్టు తీర్పును కూడా అపహాస్యం చేస్తున్నారు. నా పర్యటనకు మద్దతు తెలిపిన వాళ్లను కొట్టించి వారిని స్టేషన్ లో అక్రమంగా నిర్బంధించారు. డీఐజీ ఫౌల్ రాజు గారు అంటా కోర్టు ఆదేశాల ప్రకారం ఎంపీకి మాత్రమే భద్రత ఇస్తామని, మిగిలిన వారితో సంబంధంలేదన్నారు అంట. ఎంపీ ప్రొటోకాల్ ప్రకారం తన నియోజకవర్గంలో ఉండడా అది జిల్లా యాంత్రానికి తెలియదా?. కేంద్రం సహకరించినప్పటికీ ప్రయాణం కదరడంలేదు. నా శ్రేయోభిలాషుల శ్రేయస్సు కోరి నా ప్రయాణాన్ని మధ్యలోనే విమరించుకుంటున్నాను. పోరాడదాం. అక్కడి నుంచే పోరాడక్కర్లేదు. ఈ ప్రభుత్వం పాలన పోయేదాక పోరాడదాం.- - ఎంపీ రఘురామకృష్ణరాజు