దేశంలో ఇతర రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ కరోనా వ్యాప్తి ఇంకా తగ్గలేదు. అయితే నిన్నటితో పోల్చితే కరోనా పాజిటివ్ కేసులు 200 మేర పెరిగాయి. కొవిడ్19 మరణాలు నిలకడగా ఉన్నాయి. గత రెండు నెలల నుంచి ఏపీలో కరోనా కేసులు దాదాపు వెయ్యి, లేదా అంతకన్నా ఎక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,337 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో రాష్ట్రంలో మరో 9  మంది కరోనా మహమ్మారితో పోరాడుతూ మరణించారు. 


ఏపీలో కరోనా రికవరీ రేటు మెరుగ్గా ఉందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 20,35,795 కు గాను నేటి ఉదయం వరకు 20,07,026 మంది కోలుకుని ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యారు. నిన్నటితో పోల్చితే యాక్టివ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. ఏపీలో ప్రస్తుతం 14,699 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. ఈ మేరకు ఏపీ వైద్య, ఆరోగ్య శాఖ ఆదివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. 


Also Read: Diabetes: షుగర్ వ్యాధి ఒంట్లో చేరి ఏం చేస్తుందో తెలుసా... జాగ్రత్త పడండి






ఏపీలో ఇప్పటివరకూ 2 కోట్ల 77 లక్షల 21 వేల 082 శాంపిల్స్‌కు కొవిడ్19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, అందులో గడిచిన 24 గంటల్లో 68,568 శాంపిల్స్ టెస్టు చేసినట్లు బులెటిన్‌లో పేర్కొన్నారు. నిన్న ఒక్కరోజులో 1,282 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. అయితే రికవరీ కేసుల కన్నా పాజిటివ్ కేసులే అధికంగా ఉన్నాయి.


ఏపీలో అధికంగా చిత్తూరు జిల్లాలో ముగ్గురు, కృష్ణాలో ముగ్గురు.. ప్రకాశం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున కరోనా బారిన పడి చనిపోయారు. ఏపీలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 14,070కు చేరింది. కేసులవారీగా చూస్తే గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 231, తూర్పు గోదావరి జిల్లాలో 198, ప్రకాశంలో 161, కృష్ణాలో 144, గుంటూరులో 141 మంది తాజాగా కరోనా బారిన పడ్డారని ఏపీ వైద్య శాఖ తెలిపింది.


Also Read: మంచి బ్యాక్టిరియాతో మెదడుకు సంబంధం... వాటి కోసం ఏం తినాలంటే...