టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విటర్ ద్వారా ప్రకటించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని చెప్పారు. తనకు కరోనా పాజిటివ్ అని తేలగానే వెంటనే ఇంట్లోనే క్వారంటైన్‌లోకి వెళ్లిపోయానని, అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా వెల్లడించారు. ఇటీవలి కాలంలో తనకు దగ్గరగా మెలిగిన వారు, నేరుగా కాంటాక్ట్ ఉన్నవారు కూడా జాగ్రత్త వహించాలని చంద్రబాబు సూచించారు. వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, అవసరమైతే క్వారంటైన్‌లోకి వెళ్లాలని చెప్పారు. అందరూ సేఫ్‌గా, జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు కోరారు.






మరోవైపు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డ సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని సోమవారం (జనవరి 17) సోషల్ మీడియాలో లోకేష్ ప్రకటించారు. తనకు లక్షణాలేమీ లేవని... ఎలాంటి అనారోగ్యం లేదని హోంఐసోలేషన్‌లో ఉన్నానని లోకేష్ ప్రకటించారు. తనను కలిసిన వారందరూ టెస్టులు చేయించుకోవాలని సూచించారు.


గత వారం రోజులుగా లోకేష్ పార్టీ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనడం లేదు. ఈ ఉదయమే స్కూళ్లకు సెలవులు ఇవ్వాలి ఏపీ ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాస్తూ ట్వీట్ చేశారు. కాసేపటికే తనకు కరోనా సోకిందని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసుతో పాటు ఇతర చోట్ల కరోనా నిబంధనలను పక్కాగా పాటిస్తూ ఉంటారు.


Also Read: సీఐడీ విచారణకు రఘురామ డుమ్మా.. 4వారాల సమయం కావాలని లేఖ !


తొలి రెండు వేవ్‌లలో అందుకే టీడీపీ ఆఫీసు సిబ్బంది కూడా పెద్దగా కరోనా బారిన పడలేదు. కానీ థర్డ్ వేవ్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఇప్పుడు లోకేష్‌కు కూడా సోకింది. తనకు కరోనా సోకినట్లుగా చంద్రబాబు, లోకేష్ పెట్టిన ట్వీట్‌కు టీడీపీ కార్యకర్తలు స్పందిస్తున్నారు. వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ అన్ని చోట్లా తీవ్రంగా విస్తరిస్తోంది. అయితే ఎక్కువ మందికి అతి స్వల్ప లక్షణాలు.. లేదా లక్షణాలు లేని పరిస్థితి కనిపిస్తోంది. ఆస్పత్రి పాలయ్యేవారి సంఖ్య.. మొదటి, సెకండ్‌ వేవ్‌లతో పోలిస్తే తక్కువగానే ఉంది.


Also Read: తక్షణమే విద్యాసంస్థలకు సెలవులు పొడిగించండి.... సీఎం జగన్ కు నారా లోకేశ్ లేఖ


Also Read: ట్విట్టర్ వేదికగా పరస్పరం ట్వీట్లు విసురుకుంటున్న వైసీపీ ఎంపీలు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి